బీజేపీలో టిక్కెట్ ఇస్తారో లేదోనని విజయశాంతి అసంతృప్తి !

బీజేపీలోనూ విజయశాంతి ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. తనకు ప్రాధాన్యం దక్కడం లేదని కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆమె మీడియా ముందే వాపోయారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న విజయశాంతి .. ఆ పార్టీపై అసంతృప్తితో గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరారు. మొదట్లో కొన్ని రోజులు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. తర్వాత ఆమె సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడూ కేసీఆర్ నిర్ణయాలపై విమర్శలు చేయడం మినహా పెద్దగా తెర ముందుకు రావడం లేదు. పార్టీ కార్యాలయంలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో బీజేపీ నేతలందరూ తమ తమసీట్లకు ఖర్చీఫ్‌లు వేసుకుంటున్నారు.

కానీ విజయశాంతి విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఆమె కంటూ ప్రత్యేకంగా నియోజకవర్గం లేదు. గతంలో మెదక్ పార్లమెంట్.. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చే్శారు. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాలు ఇస్తారో లేదో తెలియదు. ఏ స్థానాలు ఇస్తారో కూడా క్లారిటీ లేదు. అందుకే తన అసంతృప్తిని మీడియా ముందు వ్యక్తం చేశారు. తనను ఎందుకు మాట్లాడనివ్వడం లేదో బీజేపీ నేతలనే అడగాలన్నారు. ఏ స్థానం నుంచి పోటీ చేయాలో బీజేపీ నేతలకు క్లారిటీ లేదన్నారు విజయశాంతి ఇలా బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేయడం బీజేపీలో కలకలం రేపుతోంది.

గతంలో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు ఆమె ఇంటి చుట్టూ తిరిగారు. ఇప్పుడు ఆమె అసంతృప్తి విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకూ బీజేపీలో ఆమెకు దక్కుతున్న ప్రాధాన్యం చూస్తే.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా కష్టమేనన్న వాదన ఆ పార్టీలో అప్పుడే వినపిిసత్ోంది పెద్ద ఎత్తున చేరికలు ఉండటంతో.. కీలక నేతలు చేరితే చాన్స్ ఉండదని విజయశాంతి భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close