చిరంజీవిని రాజకీయాలు వదలలేదు.. నిజంగానే !

రాజకీయాలు తనకు దూరం కాలేదంటూ చిరంజీవి చెప్పిన సినిమా డైలాగ్ నిజం. ఎందుంటే ప్రతీ రోజూ ఆయన జపం చేయనిదే వైసీపీలాంటి పార్టీలకు పూట గడవు. పవన్ కల్యాణ్ ఫీవర్‌తో చిరంజీవి ద్వారా బయటపడాలనుకుంటున్న వైసీపీ.. ఆయనను మొహమాట పెడుతోంది. ఆయనకు తోడు బీజేపీ కూడా.. అదే పనిలో ఉంది. అందకే చిరంజీవి రాజకీయాలకు దూరం అయ్యారు కానీ.. రాజకీయాలు ఆయనకు దూరం కాలేదు.

చిరంజీవికి ఓ రాజ్యసభ సీటిచ్చి తమ గుప్పిట్లో ఉంచేసుకోవాలని గతంలో వైసీపీ చాలా ప్రయత్నించింది. చిరంజీవి ఒక్కడినే విందుకు పిలిచి.. వైఎస్ భారతి కొసరి కొసరి వడ్డించి.. మరీ మర్యాదలు చేశారు. ఆయన హైదరాబాద్ వెళ్లేందుకు విమానం ఎక్కగానే… వైసీపీలోకి చిరంజీవి.. రాజ్యసభ సీటు ఆఫర్ అనే ప్రచార చేశారు. కానీ చిరంజీవి కొట్టి పడేశారు. భారతి గారు వడ్డించిన వంట బాగుందని మెచ్చుకున్నారు. అయితే చిరంజీవి తమ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి పవన్‌కు కౌంటర్ ఇవ్వడానికి ఆయనను వాడేసుకుంటూ ఉంటుంది.

బీజేపీ కూడా చిరంజీవిని తమ పార్టీలోకి తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత సోము వీర్రాజు మొదట చిరంజీవితోనే భేటీ అయ్యారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆప్యాయంగా చిరంజీవితో మాట్లాడారు . అప్పుడు కూడా చిరంజీవి – బీజేపీ అనే ప్రచారం ఊపందుకుంది. కానీ చిరంజీవి గుంభనంగా ఉండిపోయారు.

పైకి చెప్పకపోయినా సోదరుడివైపే చిరంజీవి ఉంచారు. చిరంజీవి సోదరుడి గురించి వ్యక్తిగతంగా స్పందిస్తూంటారు. పవన్ అనుకున్నది సాధిస్తారని చెబుతూంటారు. అయితే చిరంజీవి నేరుగా చెప్పినా చెప్పకపోయినా జనసేన పార్టీకే ఆయన మద్దతు ఉంటుందనేది బహిరంగరహస్యం. ఎలా చూసినా నిజంగానే చిరంజీవి రాజకీయాల్ని వద్దనుకున్నారు. దూరంగా ఉన్నారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయనను వదిలి పెట్టలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close