బాక్సాఫీస్ రిపోర్ట్‌: ఈవారం కూడా నీర‌స‌మే!

గ‌త వారం ఫ్లాపుల హ్యాట్రిక్ కొట్టింది టాలీవుడ్. ఒకే రోజు మూడు సినిమాలు (ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, శాకిని – డానికి, నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని) విడుద‌లైతే.. మూడూ ఫ్లాపులే. ఈ వారం కూడా అదే ఫీట్ రిపీట్ అయ్యింది. ఈ శుక్ర‌వారం అల్లూరి, కృష్ణ వ్రింద విహారి, దొంగ‌లున్నారు జాగ్ర‌త్త ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. మూడూ ఫ్లాప్ టాక్ తెచ్చుకొన్నాయి. మూడింటిలో.. కృష్ణ వ్రింద విహారినే కాస్త బెట‌ర్‌. దానికే కాస్తో కూస్తో వ‌సూళ్లు ద‌క్కుతున్నాయి. అల్లూరి బీ, సీల్లో ఓమాదిరి వ‌సూళ్లు తెచ్చుకొంది. కానీ… అది చాల‌వు. దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. నిజానికి ఇది ఓటీటీలో విడుద‌ల చేయాల్సిన సినిమా. ఓటీటీలు ఈమ‌ధ్య డైరెక్ట్ రిలీజ్‌లు చేయ‌డం లేదు. క‌నీసం 10 – 20 థియేట‌ర్ల‌లో సినిమాని విడుద‌ల చేస్తే, ఆ త‌ర‌వాత‌.. ఓటీటీకి తీసుకొంటున్నారు. అందుకోసమే ఈసినిమాని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల్సివ‌చ్చింద‌ని టాక్‌.

ఈ శుక్ర‌వారం `అవ‌తార్‌` రీ రిలీజ్ అయ్యింది. రీ రిలీజ్ లోనూ ఈ సినిమాకి మంచి వ‌సూళ్లు ద‌క్కాయి. హైద‌రాబాద్‌లో ఎన్ని షోలు వేస్తే.. అన్నీ ఫుల్స్ అవుతున్నాయి. బాల‌కృష్ణ `చెన్న కేశ‌వ‌రెడ్డి` రీ రిలీజ్‌లోనూ అద‌ర‌గొట్టింది. వ‌చ్చేవారం మ‌ణిర‌త్నం సినిమా విడుద‌ల అవుతోంది. కార్తి, విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష లాంటి స్టార్లున్నారు కాబ‌ట్టి… మ‌ణిర‌త్నం సినిమా కాబ‌ట్టి ఓ లుక్ వేయొచ్చు.కాక‌పోతే ఈ సినిమాకి ఏమాత్రం బ‌జ్ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close