బోయ‌పాటి సినిమా ఎప్పుడు..?

అఖండ త‌ర‌వాత‌.. బోయ‌పాటి శ్రీ‌ను తిరుగులేని ఫామ్ లోకి వ‌చ్చేశారు. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. బాల‌కృష్ణ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా `అఖండ‌` రికార్డు సృష్టించింది. ఆ వెంట‌నే రామ్ తో ఓ సినిమా ప్ర‌క‌టించి, క్లాప్ కూడా కొట్టేశారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. రామ్ తో `వారియ‌ర్‌` తీసిన నిర్మాత‌లే బోయ‌పాటి శ్రీ‌ను సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. వారియ‌ర్‌తో బాగా న‌ష్ట‌పోవ‌డం వ‌ల్ల బ‌డ్జెట్ స‌మ‌స్య‌లు త‌లెత్తాయ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెప్పుకొంటున్నాయి. ఈలోగా గౌత‌మ్ మీన‌న్ తో రామ్ సినిమా ఉంటుంద‌ని వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో బోయ‌పాటి సినిమా కంటే ముందే.. గౌత‌మ్ మీన‌న్ సినిమా ప‌ట్టాలెక్కుతుందేమో అన్న ఊహాగానాలు వ్యాపించాయి. అయితే… ముందు బోయ‌పాటి సినిమానే ప‌ట్టాలెక్కుతుంద‌ని, ఈ విష‌యంలో సందేహ‌మే అవ‌స‌రం లేద‌ని బోయ‌పాటి కాంపౌండ్ వ‌ర్గాలు ధృవీక‌రించాయి.

ఈ నెలాఖ‌రున ఈ సినిమా షూటింగ్ మొద‌లు కావాల్సింది. అయితే… ద‌స‌రా త‌ర‌వాతే తొలి షెడ్యూల్ మొద‌లెట్టాల‌ని తాజాగా నిర్ణ‌యించుకొన్నార‌ట‌. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాక‌.. నాన్ స్టాప్ గా షూటింగ్ చేసుకొంటూ పోవాల‌ని బోయ‌పాటి భావిస్తున్నారు. ఈ సినిమాకి రూ.100 కోట్ల బ‌డ్జెట్ కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. రామ్ కెరీర్‌లోనే కాదు, బోయ‌పాటి కెరీర్‌లోనూ ఇదే కాస్ట్లీ సినిమా అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close