చిరుకి క‌లిసొచ్చిన రీమేక్‌!

ఆచార్య‌తో చిరంజీవి ఫ్యాన్స్ దారుణంగా డీలా ప‌డిపోయారు. అన్ని వైపుల నుంచీ విమ‌ర్శ‌లే. ఆ సినిమా ఓపెనింగ్స్ కూడా నిరాశ‌కు గురి చేశాయి. చిరంజీవి ఇక రిటైర్ అయిపోవొచ్చేమో..? అనేంత‌గా భ‌య‌పెట్టాయి. అయితే… చిరు `గాడ్‌ఫాద‌ర్‌`తో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకొన్నారు. ఈ సినిమాలో చిరు పెర్‌ఫార్మ్సెన్స్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌, ఈ సినిమాకి వ‌స్తున్న స్పంద‌న‌, వ‌సూళ్లు.. ఇలా… అన్ని విధాలుగానూ అభిమానుల‌కు ఊపిరి పోశాయి.

నిజానికి లూసీఫ‌ర్ రీమేక్ అన‌గానే ఫ్యాన్స్ కూడా నిరుత్సాహ ప‌డిపోయారు. లూసీఫ‌ర్ చిరంజీవి టైపు సినిమా కాదు క‌దా, అని భ‌య‌ప‌డ్డారు. ఇందులో పాట‌ల్లేవు, చిరు సినిమాల్లో రొటీన్ గా క‌నిపించే కామెడీ, రొమాన్స్ ఏమీ లేవు. అవి లేకుండా కూడా చిరు మెప్పించ‌గ‌ల‌డు… అని గాడ్ ఫాద‌ర్ నిరూపించింది. చిరు వ‌య‌సు పైబ‌డింది. ఇప్పుడు కూడా డాన్సులు, రొమాన్సుల‌తోనే అభిమానుల్ని మెప్పించాలని అనుకోవ‌డం అత్యాసే. చిరు రూటు మార్చాల్సిన వేళ‌.. గాడ్ ఫాద‌ర్ ఓ పునాది రాయిగా ఉప‌యోగ‌ప‌డుతుంది. చిరుకి రీమేకులు బాగా క‌లిసొచ్చాయి. ఆయ‌న రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం.150 కూడా రీమేకే. తొమ్మిదేళ్ల త‌ర‌వాత చిరంజీవి సినిమా చేసినా – అభిమానులు మ‌ళ్లీ అక్కున చేర్చుకొని భారీ వ‌సూళ్లు అందించారు. ఆ త‌ర‌వాత వ‌చ్చిన సైరా, ఆచార్య‌… రెండూ వ‌ర్జిన‌ల్ క‌థ‌లు. రెండూ నిరాశ క‌లిగించిన త‌రుణంలో మ‌రో రీమేక్ చిరు కెరీర్‌కి ఊపిరిపోసిన‌ట్టైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడివాడ వైసీపీలో డబ్బు పంపిణీ రచ్చ

కొడాలి నాని గుడివాడను స్థావరంగా మార్చుకున్నారు. పార్టీ ఏదైనా నాలుగు సార్లు గెలిచారు. ఐదో సారి గెలవడానికి ఆయన డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. గుడివాడ పట్టణంలో ఒక్కో వార్డుకు...

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close