కేసీఆర్‌కు జ్వరం – ఢిల్లీకి సీఎస్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వారం రోజులు అయింది. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారేమో స్పష్టత లేదు కానీ.. బహిరంగంగా మాత్రం ఎవరితోనూ చర్చలు జరపడం లేదు. అయితే హఠాత్తుగా ఆయన సీఎస్‌ను ఢిల్లీ పిలిపించుకున్నారు. ఓ వైపు మునుగోడు ఎన్నికలు జరుగుతూండటం..మరో వైపు పాలనను పట్టించుకునేవారు లేకపోయినా సరే కేసీఆర్ ఢిల్లీలో మకాం వేయడంతో రాజకీయ పరమైన విమర్శలకు కారణం అవుతోంది.

అయితే ఇప్పటి వరకూ ఏమీ చెప్పని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పుడు కేసీఆర్‌కు స్వల్ప అనారోగ్యం కలిగిందని.. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని అందుకే విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఎలాంటి సమావేశాలు మూడు రోజులు నిర్వహించలేదని అంటున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల కారణంగానే విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు. కేసీఆర్ హైదరాబాద్ రాలేకపోతున్నందన… సీఎస్ తో పాటు కొంత మంది ఉన్నతాధికారులను ఢిల్లీకి పిలిపించుకున్నారు.

ఎవరైనా పార్టీ ప్రకటించిన తర్వాత ఎలాంటి గ్యాప్ రాకుండా .. పార్టీని ప్రజల్లో నానే చేయాలని అనుకుంటారు. అలా చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది. ఆ విషయం కేసీఆర్‌కు తెలియనిదేం కాదు. కానీ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాలని తీర్మానం చేసిన తర్వాత ఆయన సెలెంట్ అయిపోయారు. కనీసం జాతీయ మీడియాకు కూడా ఇంటర్యూలు ఇవ్వలేదు. తన పార్టీ విధివిధానాలను కూడా సవయంగా ప్రకటించలేదు. అదే సమయంలో సెమీ ఫైనల్ లాంటి మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో ఆయన ఢిల్లీలో మకాం వేయడం.. అక్కడికే ఉన్నతాధికారుల్ని పిలిపించుకోవడం వెనుక మతలబు ఉందని నమ్మకానికి వస్తున్నారు. అదేమిటన్నది టీఆర్ఎస్ నేతలకు స్పష్టత లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

వైసీపీ ఘోర పరాజయం ఖాయం – జగన్‌కు ఎప్పుడో చెప్పా : ప్రశాంత్ కిషోర్

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ తన అంచనాను మరోసారి చెప్పారు. వైసీపీ ఘోర పరాజయం ఖాయమని అన్నారు. ఈ విషయాన్ని తాను ఏడాదిన్నర కిందటే జగన్ కు చెప్పానని స్పష్టం చేశారు. ఆర్టీవీ...

ఆ రూ. 14వేల కోట్లు మంగళవారం ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పడం లేదేంటి ?

తెలంగాణ ఎన్నికల సమయంలో రైతు బంధు రాజకీయం జరిగింది. ఎన్నికల సంఘం నిధులు జమ చేయడానికి అంగీకారం తెలిపింది. కానీ హరీష్ రావు దాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడంతో మళ్లీ...

ఎలక్షనీరింగ్ : అంచనాల్ని అందుకోలేకపోయిన వైసీపీ

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ....

HOT NEWS

css.php
[X] Close
[X] Close