రోజాకు చెక్ పెట్టేందుకు వైసీపీ పెద్దల స్కెచ్ ?

మంత్రి రోజా పరిస్థితి ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అన్నట్లుగా ఉంది. పార్టీ అధినేత జగన్ మనసును మెప్పించేందుకు ఆమె తన క్యారెక్టర్‌ను సైతం దిగజార్చుకుని మరీ ప్రవర్తిస్తున్నారు. కానీ ఆమెకు వ్యతిరేకంగా పార్టీ నేతలను హైకమాండ్ ప్రోత్సాహిస్తోంది. నగరిలో జరుగుతున్న రాజకీయం ఆమెకు నిద్రపట్టనీయడం లేదు. నగరి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు రోజా లేకుండానే జరిగిపోతున్నాయి. తాజాగా ఆర్బీకేకు పార్టీ నేతలంతా కలిసి శంకుస్థాపన చేశారు. దీనికి రోజాను పిలువలేదు. దీంతో ఆమె తన ఆవేదన ఫోన్‌లో ఎవరితోనో చెప్పుకుని మీడియాకు లీక్ చేయించారు.

తాను ప్రాణలు పణంగా పెట్టి రాజకీయం చేస్తున్నామని కానీ తమను పట్టించుకోవడం లేదని..తన వ్యతిరేకుల్ని ప్రోత్సహిస్తున్నారన్నది ఆమె ఆవేదన. నగరి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో కీలక నేతలు రోజాకు వ్యతిరేకంగానే ఉన్నారు. వారెవరూ రోజా పేరెత్తరు. ఫ్లెక్సీలు పెడితే కనీసం ఫోటో కూడా పెట్టరు. నగరి మున్సిపల్ చైర్మన్ సహా అందరూ వ్యతిరేకమే. చాలా సార్లు ఈ విషయాలపై గొడవలు జరిగాయి. కానీ రోజా చేయగలిగిందేమీ లేకపోయింది.

రోజాకు చెక్ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామంచ్రారెడ్డి మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. నగరి నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్న వారంతా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే. రోజాకు మంత్రి పదవి కూడా.. ఆమె నోటికి భయపడే ఇచ్చారని చెబుతారు. ఒక వేళ పదవి ఇవ్వకపోతే ఆమె చేసే రచ్చతో పరువుపోతుందని భయపడి ఇచ్చారని.. కానీ ఆమెకు చెక్ పెట్టడానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు. మొత్తంగా విశాఖ విమానాశ్రయంలో రోజా వేళ్లు చూపించి రెచ్చగొట్టారని.. అదే పని. రోజాకు నగరి నాయకులు కౌంటర్‌గా ఇస్తున్నారన్న సెటైర్లు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close