రోజాకు చెక్ పెట్టేందుకు వైసీపీ పెద్దల స్కెచ్ ?

మంత్రి రోజా పరిస్థితి ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అన్నట్లుగా ఉంది. పార్టీ అధినేత జగన్ మనసును మెప్పించేందుకు ఆమె తన క్యారెక్టర్‌ను సైతం దిగజార్చుకుని మరీ ప్రవర్తిస్తున్నారు. కానీ ఆమెకు వ్యతిరేకంగా పార్టీ నేతలను హైకమాండ్ ప్రోత్సాహిస్తోంది. నగరిలో జరుగుతున్న రాజకీయం ఆమెకు నిద్రపట్టనీయడం లేదు. నగరి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు రోజా లేకుండానే జరిగిపోతున్నాయి. తాజాగా ఆర్బీకేకు పార్టీ నేతలంతా కలిసి శంకుస్థాపన చేశారు. దీనికి రోజాను పిలువలేదు. దీంతో ఆమె తన ఆవేదన ఫోన్‌లో ఎవరితోనో చెప్పుకుని మీడియాకు లీక్ చేయించారు.

తాను ప్రాణలు పణంగా పెట్టి రాజకీయం చేస్తున్నామని కానీ తమను పట్టించుకోవడం లేదని..తన వ్యతిరేకుల్ని ప్రోత్సహిస్తున్నారన్నది ఆమె ఆవేదన. నగరి నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో కీలక నేతలు రోజాకు వ్యతిరేకంగానే ఉన్నారు. వారెవరూ రోజా పేరెత్తరు. ఫ్లెక్సీలు పెడితే కనీసం ఫోటో కూడా పెట్టరు. నగరి మున్సిపల్ చైర్మన్ సహా అందరూ వ్యతిరేకమే. చాలా సార్లు ఈ విషయాలపై గొడవలు జరిగాయి. కానీ రోజా చేయగలిగిందేమీ లేకపోయింది.

రోజాకు చెక్ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామంచ్రారెడ్డి మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. నగరి నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్న వారంతా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే. రోజాకు మంత్రి పదవి కూడా.. ఆమె నోటికి భయపడే ఇచ్చారని చెబుతారు. ఒక వేళ పదవి ఇవ్వకపోతే ఆమె చేసే రచ్చతో పరువుపోతుందని భయపడి ఇచ్చారని.. కానీ ఆమెకు చెక్ పెట్టడానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు. మొత్తంగా విశాఖ విమానాశ్రయంలో రోజా వేళ్లు చూపించి రెచ్చగొట్టారని.. అదే పని. రోజాకు నగరి నాయకులు కౌంటర్‌గా ఇస్తున్నారన్న సెటైర్లు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

ఆ ఇద్దరు మంత్రులతో రేవంత్ కు గ్యాప్ పెరుగుతుందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సంబంధిత మంత్రులు లేకుండా రేవంత్ సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. బుధవారం సచివాలయంలో వ్యవసాయ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close