ఈటల, కోమటిరెడ్డిలకు ఢిల్లీ పిలుపు – కీలక బాధ్యతలిస్తారా ?

ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరి ఉపఎన్నికలను ఎదుర్కొన్న ఇద్దరు నేతలను బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. ఇతర తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల్ని ఆహ్వానించలేదు. కేవలం వారిద్దరిని మాత్రమే పిలిచారు. వారితో ఇతర ముఖ్య నేతలతో పాటు ..చివరిగా అమిత్ షా కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్న వారు బలంగానే పోరాడుతున్నారు. కానీ వారు ఎక్కడ బలపడితే తమ స్థానాలకు ఎసరు వస్తుందోనని బీజేపీలో పాతుకుపోయిన కొంత మంది వారికి సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఈటల రాజేందర్ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా గతంలో చాలా సార్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ వారు తమ అసంతృప్తిని హైకమాండ్‌కు తెలిసేలా చేస్తున్నారు కానీ ఆ ప్రభావం పార్టీపై పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో చేరికల ఇంచార్జ్‌గా కూడా ఈటల ఉన్నారు. కానీ చేరికలు… సంప్రదింపులు అన్నీ ఈటలకు సంబంధం లేకుండానే సాగుతున్నాయి.

ఈ మొత్తం అంశాలపై హైకమాండ్ వీరి వద్ద నుంచి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కుదురుకోలేకపోతున్నారన్న ప్రచారంతో రాబోయే కాలంలో వచ్చి చేరే వారికి మరింత భరోసా ఇచ్చేందుకు ఈటల , కోమటిరెడ్డిలకు బీజేపీ హైకమాండ్ కొన్ని సూచనలు చేయడంతో పాటు కీలక బాధ్యత్లు అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరిలో ఎవరికైనా కీలక పదవి లభిస్తే.. పార్టీలో చేరాలనుకునేవారు కూడా మరింత ఉత్సాహం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close