తేలిపోతున్న “సిట్” – దూకుడు పెంచుతున్న “ఈడీ” !

తెలంగాణ, కేంద్రం మధ్య సాగుతున్న దర్యాప్తు సంస్థల మధ్య పోరాటంలో సిట్ దర్యాప్తు అంతకంతకూ తేలిపోతోంది. కానీ ఈడీ మాత్రం స్టడీగా పని చేసుకుటూ పోతోంది., సిట్ ఇంత వరకూ తెలంగాణ బయట వ్యక్తుల్ని ఒక్కర్ని కూడా రప్పించి ప్రశ్నించలేకపోయింది. ఇద్దరిపై లుకౌట్ నోటీసులు జారీచేసినా… ప్రయోజనం లేకపోయింది. అరెస్టులు చేస్తామని హడావుడి చేస్తోంది కానీ.. వారు వెంటనే కోర్టులకు వెళ్లి సిట్ తీరుపై అనుమానాలు, సందేహాలు లేవనెత్తుతున్నారు. దీంతో సిట్ ముందరి కాళ్లకు ఎప్పటికప్పుడు బంధాలు పడుతున్నాయి.

బీఎల్ సంతోష్‌కు ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే స్టే ఉంది. తుషార్‌నూ అరెస్ట్ చేయవద్ది హైకోర్టు చెప్పింది. సీబీఐకి ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్ విచారణలో ఉంది. సిట్ హైకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో… ఎక్కడై సరైన ఆధారాలు లేవు. వారు ఫలానా చోట కలిశారని చెబుతున్నారు కానీ.. నిర్దిష్టంగా… ఎమ్మెల్యేల కొనుగోలు కోసమే కలిశారని చెప్పే ఆధారాలను చూపించడం లేదు. అక్కడ వారు కలిస్తే నేరం ఏమిటన్నది ఎవరికైనా వచ్చే మౌలికమైన సందేహం. వాట్సాప్ చాట్‌లను.. కాల్ రికార్డులను చూపిస్తున్నారు. సెల్ లొకేషన్లను సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. హైకోర్టుకు సమర్పించిన వాట్సాప్ చాట్‌లో సంబంధం లేని వ్యక్తుల పేర్లతో కొన్ని సంభాషణలు ఉన్నాయి. దీంతో సిట్ విచారణ తీరు తేలిపోతోందన్న అభిప్రాయం బలపడుతోంది.

మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాత్రం ఈడీ దూకుడుగా .. ప్రణాళికాబద్దంగా మందుకెళ్తోంది. అమిత్ అరోరా ను అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఫోన్లు మార్చిన వైనం… ఇతర వ్యవహారాలు చేర్చారు. ఆర్థిక లావాదేవీల అంశాన్నీ ప్రస్తావించారు. శరత్ రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలే ప్రధానం అని చెబుతున్నారు. ఇప్పుడ వారికి అరెస్ట్ ముప్పు పొంచి ఉంది. ఈ స్కామ్‌ విచారణకు కౌంటర్‌గా సిట్‌ను దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నా..సాధ్యం కావడం లేదు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉంది కాబట్టి తెలంగాణ పోలీసులకు అధికారం సరిపోదన్న కారణంతో… హైకోర్టు సీబీఐకి ఇస్తే.. మొత్తం సీన్ మారిపోతుంది. అందుకే… ఈ విచారణల్లో నెక్ట్స్ ఏం జరుగుతుందన్న ఆసక్తి అంతటా ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

వైసీపీ ఘోర పరాజయం ఖాయం – జగన్‌కు ఎప్పుడో చెప్పా : ప్రశాంత్ కిషోర్

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ తన అంచనాను మరోసారి చెప్పారు. వైసీపీ ఘోర పరాజయం ఖాయమని అన్నారు. ఈ విషయాన్ని తాను ఏడాదిన్నర కిందటే జగన్ కు చెప్పానని స్పష్టం చేశారు. ఆర్టీవీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close