జగన్‌ను ట్రోల్ చేసిన మంచు లక్ష్మి – ఊరుకుంటారా ?

మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు కానీ.. సహజంగా వివాదాస్పద అంశాల జోలికి పోరు. మహిళా సమస్యలకు సంబంధించిన అంశాలపై అగ్రెసివ్‌గా స్పందిస్తారు. లేకపోతే.. సొంత పోస్టులు ఎక్కువగా పెట్టుకుంటారు. కానీ హఠాత్తుగా సీఎం జగన్‌ను ట్రోల్ చేసేలా ఓ పోస్టును రీ ట్వీట్ చేసి.. కామెడీగా “లోల్” కామెంట్ పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే… అది జగన్‌ను తీవ్రంగా అవమానించే ట్వీట్.

కొన్నాళ్ల క్రితం సీఎం జగన్ ఢిల్లీలో జరిగిన ఓ సమావేశానికి వెళ్లారు. అక్షమాల ప్రకారం ఆంధ్రప్రేదశ్ సీఎం జగన్‌కు మొదటి సీటు కేటాయించారు. అక్కడ కూర్చున్న జగన్ ఏం చేయాలో తెలియక బిత్తర చూపులు చూస్తూ చాలా సేపు గడిపారు. ఈ వీడియోను ఇటీవల బాగా ట్రోల్ చేస్తున్నారు. బీ లైక్ అంటూ.. పెళ్లి బంతిలో కూర్చుని విస్తరాకు కోసం ఎదురు చూస్తున్న నేను …. ఎగ్జామ్ హాల్‌లో క్వశ్చన్ పేపర్ చూశాకా నా పరిస్థితి.. సీరియస్ మీటింగ్‌లో ఉన్నప్పుడు కడుపులో గిరగిరా తిరిగితే… ఎలా ఉంటుందంటే అంటూ వీడియో మీమ్స్ పెడుతున్నారు.

ఇలాంటి వాటిలో ఒకటి షేర్ చేసిన మంచు లక్ష్మి .. మరింత పరువు తీసేలా లోల్ అంటూ కామెంట్ పెట్టింది. ఇది వైసీపీ అభిమానులకు నచ్చలేదు. ఆమెపై దండయాత్ర చేస్తున్నారు. వైసీపీ మాత్రం కామెంట్లు చేస్తున్నారు.కానీ మంచు లక్ష్మి మాత్రం స్పందించలేదు. ఈ ట్వీట్‌ను తీసేయలేదు. నిజానికి మంచు విష్ణుకు జగన్ దగ్గరి బంధువు. మోహన్ బాబు వైసీపీనేత. అయినా కూడా మంచు లక్ష్మి ఇలా ట్రోల్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close