తిరుమలలో జరగని అపవిత్రం ఏం మిగిలింది .. చివరికి డ్రోన్ కూడా !

ప్రపంచవ్యాప్తంగా హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల శ్రీవారి దర్శనం సామాన్యులకు దూరం చేయడం దగ్గర్నుండి… జరగాల్సిన అపవిత్రాలన్నింటినీ చేసేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలిగించడం ఓ ఎత్తు అయితే ఇప్పుడు ఆలయంపై డ్రోన్ ఎగరేసి మరీ వీడియోలు చిత్రీకరించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి ఆలయంపై దర్జాగా డ్రోన్ ఎగురవేసి వీడియోలు చిత్రీకరించి.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇవి వైరల్ గా మారాయి. అసలు డ్రోన్ ను ఎలా అనుమతించారన్నది పజిల్ గా మారిపోయింది.

శ్రీవారి ఆలయం నో ఫ్లై జోన్ లో ఉంది. అక్కడ గాల్లో ఎగరడానికి ఎలాంటి యంత్రాలను అనుమతించరు. కానీ డ్రోన్ ఎగురవేశారు. ఇది ఆగమశాస్త్రానికి కూడా విరుద్ధం కావడంతో పండితులు కూడా నిర్ఘాంతపోతున్నారు. ఇక భక్తుల సంగతి చెప్పాల్సిన పని లేదు. కానీ టీటీడీకి మాత్రం ఈ విషయం తెలియదు. సోషల్ మీడియాలో లక్షల మంది చూసిన తర్వాత… నిజమా అని ఆశ్చర్యపోయి.. కంటి తుడుపు ప్రకటనలు చేస్తోంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి .. విచారణ చేయిస్తామని చెబుతూనే .. అది ఏవో మ్యాపులు తీసుకుని గ్రాఫిక్స్ చేయించారని చెప్పుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు డ్రోన్స్ ఎగరడానికి అవకాశమే లేదని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చెబుతున్నారు. ఫోరెన్సిక్ కు పంపిస్తామని అంటున్నారు.

కానీ ఆ దృశ్యాలను చూసిన ఎవరికైనా అవి గ్రాఫిక్స్ లేదా.. మరో టెక్నికల్ ్రయత్నం అని ఎవరూ అనుకోరు. అది నిజంగాన్ డ్రోన్స్ తో చిత్రీకరించారని కాస్తంత పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. జరిగిన తప్పునకు ఎవరు బాధ్యులో డిసైడ్ చేయడానికి టీటీడీకి మనసొప్పేలా లేదు.

తిరుమలకు వెళ్లి వస్తున్న ప్రతి ఒక్క భక్తుడు … టీటీడీని దారుణంగా విమర్శించకుండా రావడం లేదు.గతంలో క్యూ లైన్లు, కంపార్టుమెంట్లలో వేచి ఉన్నప్పుడు.. భక్తులకు అన్న పానీయాలు అందించేవారు. కానీ ఇప్పుడు.. చిప్స్ పాకెట్లు తెచ్చి అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్నభ క్తులు వాటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రతీ చోటా వ్యాపార దృక్పథమే కనిపిస్తోంది చివరికి లీటర్ వాటర్ రూ. యాభైకి కొనాల్సి వస్తోంది. ఇంత దారుణంగా టీటీడీ పాలన ఉందని భక్తులు మండి పడుతున్నా.. వారి తీరు మారడం లేదు. ఇప్పుడు ఏకంగా శ్రీవారి ఆలయంపై డ్రోన్స్ ఎగురవేసిన గుర్తించలేకపోయారు. గుర్తించలేకపోయారా.. లేక ఇంటి దొంగల సహకారంతోనే ఇది జరిగిందా అనేది బయటకు రాదేమో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close