నిధులు, విధుల్లేని ఆ కార్పొరేషన్లకు పొడిగింపు జీవో !

ఏపీలో నిధులు, విధులు ఉండని 55 బీసీ కార్పొరేషన్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నియమించిన 55 బీసీ కార్పోరేషన్ల పదవీకాలం 2022 డిసెంబర్ 16తో ముగిసింది. ఇప్పటి వరకూ వేచి చూసి ఇప్పుడు వాటిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 55 కార్పొరేషన్లలోని ప్రతీ కార్పొరేషన్ కు ప్రత్యేకంగా ఒక్కో జీవోను విడుదల చేసింది. ఈ జీవోలో కార్పొరేషన్ ఏర్పాటు, పదవీకాలంతో పాటు ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలం పెంపును తెలియజేసింది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెనుకబడిన వర్గాల కార్పొరేషన్లకు రూపాయి సాయం చేయడం లేదు. అమ్మఒడి లాంటి పథకాల డబ్బులను కార్పొరేషన్ల ఖాతాలో చూపిస్తున్నారు. తర్వాత బీసీలకు యాభై ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అన్నింటికీ పాలకవర్గాలను నియమించారు. రెండేళ్ల పదవీ కాలం ఆ పాలకవర్గాలకు ముగిసింది. ఈ రెండేళ్లలో వారికి ఆఫీసు కూడా ఏర్పాటు కాలేదు. రూపాయి నిధులు రాలేదు. ఇటీవల వీరందర్నీ పిలిచి.. భారీగా పదవులు ఇచ్చామని బీసీ సదస్సు కూడా నిర్వహించారు. కానీ ఆ తర్వాతి రోజే పదవీకాలం పూర్తయింది. ఇప్పుడు ఎదురు చూసేలా చేసి.. వాటికి పొడిగింపు ఇచ్చారు.

అన్ని కులాలను.. వారి కార్పొరేషన్లను పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పథకాలకు ఇచ్చే నిధులు ఆ కార్పొరేషన్ల పేరుతో చూపించడం తప్ప.. ఆయా వర్గాల్లోని యువత ఆర్థికంగా ఎదిగేలా సహకరించేందుకు మాత్రం పెద్దగా ముందుకు రాలేదు. ఎవరికీ రుణాలివ్వలేదు. కానీ రాజకీయంగా తమ పార్టీ నేతలకు పదవులు కేటాయించుకోవడానికి.. ప్రచారానికి ఉపయోగపడుతూండటంతో.. కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close