11 మద్యం దుకాణాల్లో మాత్రమే డిజిటల్ పేమెంట్స్ – కానీ ప్రచారం మాత్రం….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్ని .. వ్యవస్థల్ని ఎలా మభ్య పెడుతుందో..పథకాలు..లబ్దిదారులను బట్టి చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు .. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోవడం లేదని వస్తున్న విమర్శలకు కూడా అదే విధంగా కౌంటర్ ఇస్తోంది.ఈ అంశంపై కోర్టు కేసులు పడ్డాయి. కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. కేంద్రం నుంచి డిజిటల్ పేమెంట్స్ తీసుకోవాలన్న సూచనలు వచ్చాయి. చివరికి ఇప్పుడు డిజిటల్ పెమెంట్స్ తీసుకోబోతున్నామని ప్రచారం చేశారు.. శుక్రవారం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ అధికారులు స్వయంగా ప్రకటించారు.

తీరా చూస్తే.. ఎన్ని దుకాణాల్లో ప్రారంభించారంటే.. పదకొండు అంటే పదకొండు. మొత్తం ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి. జిల్లాకు ఒక్క దుకాణంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను పెట్టలేదు. మొత్తం ఉన్న దుకాణాలు 3708. కానీ అమల్లోకి తెచ్చింది 11. దీనికి మళ్లీ డిజిటల్ వ్యవస్ధ అందుబాటులోకి అని గొప్ప ప్రచారం. ఎస్బీఐ సహకారంతో మద్యం విక్రయాల్లో ఆన్ లైన్ చెల్లింపు తీసుకొచ్చింది ఎక్సైజ్‌ శాఖ.. ఇక, డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, క్రెడిట్‌ కార్డ్ లావాదేవీలకు నిబంధనల ప్రకారం ఛార్జీల వసూలుకు నిర్ణయం తీసుకున్నారు.

మద్యం విషయంలో తయారీ దారుల దగ్గర్నుంచి అమ్మకం వరకూ మొత్తం వైసీపీ నేతల చేతుల్లో ఉండటం.. నగదు లావాదేవీలు జరుగుతూండటంతో అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఆరోపణలు ఎన్ని వచ్చినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. చిన్న చిన్న దుకాణాల్లోనూ డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటారు. కానీ మద్యం దుకాణాల్లో మాత్రం ఆ వ్యవస్థ అందుబాటులో లేదు. ఇప్పుడు తెస్తున్నామని ప్రచారం చేసి.. అందుబాటులోకి తెచ్చింది కేవలం 11 దుకాణాల్లోనే. కానీ ప్రచారం మాత్రం ఘనంగా చేసుకుంటున్నారు. అంటే డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయని నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నమన్న ఆరోపణలు ఈ కారణంగానే వస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close