28 కి.మీ దూరానికి హెలికాఫ్టరా ? అనుభవించు రాజా !

తాడేపల్లి నుంచి తెనాలి ఎంత దూరం ఉంటుంది ? ఖచ్చితంగా 28 కిలోమీటర్లు. అంటే … అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తే అరగంట పడుతుంది. సీఎం లాంటి వీఐపీలు కాన్వాయ్ కు దారిస్తారు.. ఎక్కడా అడ్డం రాకుండా చూసుకుంటారు కాబట్టి ఇరవై నిమిషాల్లో వెళ్లిపోతారు. కానీ ఈ కొద్ది దూరానికి సీఎం జగన్ హెలికాఫ్టర్ వాడేస్తున్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా మూడో విడత రైతులకు రూ. రెండు వేలు జమ చేసేందుకు మీట నొక్కేందుకు తెనాలి నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేశారు. మంగళవారం అక్కడ సభకు హాజరు కానున్నారు.

కామెడీ ఏమిటంటే.. ఈ రెండు వేలు కేంద్ర నిధులు. అవి ఒక రోజు ముందే అంటే… సోమవారమే రైతుల అకౌంట్లలో జమ చేశారు. అర్హులైన రైతుల ఖాతాల్లో అవి పడిపోయాయి. అర్హులైనా ఆ డబ్బులు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా సరే జగన్ మీట నొక్కుతారు. దాని కోసం తెనాలి వెళ్తున్నారు. మళ్లీ హెలికాఫ్టర్… ఫుల్ పేజీలు.. హాఫ్ పేజీల యాడ్స్ అన్నీ కామనే. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉంది. ఉద్యోగులకు జీతాలు నెలాఖరు వరకూ ఇస్తున్నారు. ఎవరికీ బిల్లులు చెల్లించలేకపోతున్నారు. ఇలాంటి సమయంలోనూ జగన్ రాచబోగాలకు ఏ మాత్రం లోటు రానీయడం లేదు.

గతంలో టైం సేవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రులు హెలికాఫ్టర్లు వాడేవారు. ఈ మూల నుంచి ఆ మూలకు ఉంటే హెలికాఫ్టర్లు వాడేవారు. కానీ సీఎం జగన్ మాత్రం ఇరవై కిలోమీటర్ల దూరానికి హెలికాఫ్టర్లు వాడేస్తున్నారు. నిజానికి హెలికాఫ్టర్ గాల్లో ఎగరడానికి క్లియరెన్స్ వచ్చి.. ఎగిరి.. మళ్లీ ల్యాండయి… హెలిఫ్యాడ్ నుంచి సభా వేదిక వద్దకు వెళ్లడానికే ఎక్కువ సమయం పడుతుంది. కాన్వాయ్ లో వెళ్తే చాలా సమయం అదా అవుతుంది. సమయం ఎక్కువైనా సరే హెలికాఫ్టర్ లో వెళ్తేనే దర్జా అనుకుంటున్నారు సీఎం . ఎంతైనా ప్రజాధనమేగా ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close