సమస్య ఏదైనా సజ్జలకు తెలిసిన ఆన్సర్ ” చంద్రబాబు “

సకల రోగాలకు మందు జిందాతిలిస్మాత్ లాగా… ఏపీ ప్రభుత్వ ప్రతి చేతకాని తనానికి చంద్రబాబును చూపించడం కామన్ అయిపోయింది. ముఖ్యమంత్రి ఎలాగూ మీడియా ముందుకు వచ్చి చెప్పలేరు. ఆయన తరపున మీడియా ముందుకు వచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం చంద్రబాబుతో ప్రారంభించి.. చంద్రబాబుతో ముగిస్తారు. స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేస్తోంది. ఏపీ ప్రభుత్వం ఎందుకు వేయడం లేదని నలు వైపుల నుంచి వస్తున్న ప్రశ్నలను తట్టుకోలేక ప్రెస్ మీట్ పెట్టారు.

అటు బిడ్ వేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమనలేరు. ఏమైనా అంటే ఏం జరుగుతుందో తెలుసు. అటు ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రాన్నీ ఏమనలేరు. ఏమైనా అనగలిగితే ప్లీజ్ ప్లీజ్ అనే అంటామని గెలిచిన మొదట్లోనే చెప్పారు. ఇక మిగిలిందెవరంటే చంద్రబాబు. ఏదైనా ఆయనను తిట్టేస్తే చాలనుకుంటున్నారు. ఇవాళ కూడా అదే చేశారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ ఎందుకు వేయడం లేదంటే… చంద్రబాబు ప్రైవేటీకరణలో మాస్టర్ అని పల్లవి అందుకున్నారు. ఆయన చాలా సంస్థలు ప్రైవేటీకరణ చేశారని.. ఆయన ప్రైవేటీకరణ చేయాలనుకున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని.. ఇలా చంద్రబాబు సీరిస్ వినిపించారు. పోనీ అంతా అయిపోయిన తర్వాతైనా స్టీల్ ప్లాంట్ గురించి చెబుతారా అంటే అదేమీ లేదు.

స్టీల్ ప్లాంట్ ఈవోఏలో ఏముందో తెలియకుడానే అందరూ మాట్లాడుతున్నారని..చెప్పుకొచ్చారు. జగన్ అందరి కంటే ముందే స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానితో మాట్లాడారని కావాలంటే స్టీల్ ప్లాంట్ కు ఉన్న భూములు తాకట్టు పెట్టి అయినాప్లాంట్ ను నడవచ్చని చెప్పారన్నారు. ఇలాంటి సలహాలు మోదీకి జగన్ కాదు.. చాలా మందిఇచ్చి ఉంటారు. అసలు ఎందుకు పోరాడటం లేదు అంటే మాత్రం సజ్జల దగ్గర సౌండ్ ఉండదు. రాను రాను తమ చేతకాని తనాన్ని… ఎవర్నీ ఏమీ అనలేని నిస్సహాయతను చంద్రబాబుపై చూపించి రాజకీయం చేసేస్తున్నారు. అధికారంలో ఉండీ.. ఇంత కంటే నిస్సహాయులు గతంలో ఎవరూ లేరేమో అన్న విమర్శలు ఊరకనే రావుగా మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close