కవితను జగన్ జైలుకు పంపిస్తే కేసీఆర్ ఊరుకుంటారా ?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనుక చాలా రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి బినామీల్లో ఒకరన్నప్రచారం ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మారిన తర్వాత అరబిందో రియాల్టీకి పోర్టులు, సెజ్‌లు కట్టబెట్టారు. చాలా నిగూఢమైన ఆర్థిక వ్యవహారాలు జరిగాయి. ఏపీలో అమ్మకం అయ్యే సగం లిక్కర్ శరత్ రెడ్డి కంపెనీల్లోనే తయారవుతుందని చెబుతున్నారు. అలాంటి వ్యక్తి అప్రూవర్ అయ్యారంటే జగన్ ప్రమేయం లేదని చెప్పడానికి అవకాశం లేదు.

జగన్ ఢిల్లీ పర్యటన తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారింది ఎవరిని టార్గెట్ చేయడానికన్నది సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ టార్గెట్ అని కొంత మంది చెబుతున్నారు. మరి ఆయనను ఒక్కడిని టార్గెట్ చేసి కవితను వదిలేస్తారా అన్న అనుమానం సహజంగానే వస్తుంది. అలా వదిలేస్తే కేసు బలహీనం అవుతుంది. ఎందుకుంటే ఈ స్కామ్‌లో లంచాలు… పెట్టుబడులు.. ఆదాయం భూములు అన్నీ కవిత చుట్టూనే తిరుగుతున్నాయి.

సౌత్ లాబీ నుంచి కవిత మాజీ ఆడిటర్‌‌ గోరంట్ల బుచ్చిబాబు , అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ అయ్యారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో కవిత తరపున వీరిద్దరే వ్యవహారాలు చక్కబెట్టారు. ఇప్పటికే సీబీఐ,ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించారు ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులు అప్రూవర్లుగా మారితే స్కాం జరగలేదని వాదించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నేరంలో పాల్గొన్న వారే తాము ఎలా చేశామో చెబుతున్నారు మరి. ఇలాంటి పరిస్థితి ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారికి చిక్కులు తెచ్చి పెట్టడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.

శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అవడం ద్వారా కవిత జైలుకు వెళితే… కేసీఆర్ జగన్ ను ఉపేక్షిస్తారా అన్నది ఇక్కడ కీలక ప్రశ్న. ఎందుకంటే జగన్ గెలవడంతో కేసీఆర్ పాత్ర కీలకమని చెబుతారు. అందుకే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close