కాంగ్రెస్‌పైనే నమ్మకం పెట్టుకున్న మైనంపల్లి !

ఓ అధికార పార్టీ నుంచి టిక్కెట్లు ఇచ్చినా సరే నేతలు వేరే పార్టీలో చేరిపోతున్నారంటే ఆ పార్టీకి ఊహించనంత గడ్డు పరిస్థితి ఉన్నట్లే. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ఆ పరిస్థితిని ఎదుర్కొంటోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు టిక్కెట్ ప్రకటించినప్పటికీ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. తన కుమారుడికీ టిక్కెట్ ఇవ్వలేదని ఆయన కారణం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రెండు టిక్కెట్ల ఆఫర్ లభించడంతో ఆ పార్టీలో చేరే అవకాశాల ఉన్నాయి.

మైనంపల్లి బలమైన నేత కావడంతో ఆయనను పార్టీలో ఉంచేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ ప్రయత్నించింది. రెండు సీట్లు ఇవ్వడం కుదరదు కానీ… ప్రాధాన్య ఇస్తామని హామీ ఇచ్చింది. ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ గురించి బాధ్యత తీసకుంటామని కూడా చెప్పింది. దీనిపై చాలా రోజులు ఆలోచించిన మైనంపల్లి హన్మంతరావు… బీఆర్ఎస్‌లో తనకు భవిష్యత్ ఉండదని డిసైడయ్యారు. శుక్రవారం రాత్రి బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లుగా వీడియో విడుదల చేశారు.

ఏ పార్టీలో చేరాలో అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. కానీ ఇప్పటికే ఆయన కాంగ్రెస్ తో చర్చలు పూర్తి చేశారని రెండు టిక్కెట్లు కన్ఫర్మ్ చేసుకున్నారని.. అందుకే రాజీనామా చేశారని అంటున్నారు. మైనంపల్లి రాజీనామా అంశం… బీఆర్ఎస్ పార్టీకి నైతికంగా ఇబ్బంది పెట్టేదే. తమది గెలిచే పార్టీ అని సొంత ఎమ్మెల్యేలు నమ్మడం లేదన్న అభిప్రాయం బలపడటానికి అవకాశం ఏర్పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close