ఏపీ మద్యం స్కాం : వేల కోట్ల దోపిడి – మందబాబుల ఆరోగ్యం గుల్ల !

ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపడిన తర్వాత అక్కడ జరిగిన నేరాల గురించి.. డబ్బుల ట్రాన్సాక్షన్స్ గురించి తెలిసిన తర్వాత ఏపీలో అందరూ.. .. ఓసోస్ ఇదెంత… ఏపీలో మద్యం పాలసీ పేరుతో జరుగుతున్న స్కాంలో ఈకంత అని అనుకోకుండా ఉండలేరు. ఎందుకంటే ఏపీలో జరుగుతున్న మద్యం స్కాం కనీవినీ ఊహించనిది. అంచనా వేయలేనిది. ప్రజల ఆరోగ్యాల్ని .. పణంగా పెట్టి మరీ.. వారి రక్త మాంసాల్ని పిండుకుంటున్న వేల కోట్ల అవినీతి బాగోతం. ఒక్క మద్యం దుకాణంలో ఏం జరుగుతుందో బీజేపీ అధ్యక్షరాలు పురందేశ్వరి బయట పెట్టారు.

అంతా ప్రభుత్వ కనుసన్నల్లో ఇక అవినీతి ఎక్కడ అని ప్రచారం చేస్తారు కానీ… మొత్తం అక్కడే అవినీతి ఉంది. ఏపీలో స్కాం చాలా పెద్దది. కొన్ని వేల కోట్లు నగదు రూపంలో లావాదేవీలు జరుగుతున్నాయి. దర్యాప్తు అంటూ ప్రారంభిస్తే పెద్ద తలకాయలు ఈజీగా దొరికిపోతాయి. ఇతర రాష్ట్రాల్లో మద్యం స్కాంలను చూసిన తర్వాత ఏపీ లిక్కర్ పాలసీ గురించి ఎవరైనా తెలుసుకుంటే.. ముందు అసలు చరిత్రలో కనీ వినీ ఎరుగని స్కాం ఇక్కడ జరిగి ఉంటుంది కదా అన్న అభిప్రాయం ఎవరికైనా వస్తుంది.

మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వ పెద్దల గుప్పిట్లో ఉంది. అమ్మేది ప్రభుత్వం పేరు మీద. కానీ అందులో మనుషులు దగ్గర్నుంచి లిక్కర్ తయారీ బ్రాండ్లు, రవాణా సహా మొత్తం అయిన వాళ్ల గుప్పిట్లోనే ఉంది. పైగా అంతా పూర్తిగా నగదు లావాదేవీలు. ఎన్ని వేల కోట్లు వెనకేశారో చెప్పడం కష్టం. అలాంటి స్కాంపై ఇంకా కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు బీజేపీ నేతలే విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయో ప్రత్యక్షంగా చూపించారు. ఈ లిక్కర్ పాలసీపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.

పురందేశ్వరి సీబీఐకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు ఒక్క సారి అడుగు పెడితే సంచలన విషయాలు బయటకు వస్తాయి.
ఇప్పుడు చాయిస్ బీజేపీ హైకమాండ్ చేతుల్లో ఉంది. నేరుగా సీబీఐ దిగడానికి చాన్స్ లేకపోతే.. ఈడీ దిగవచ్చు. అలా దిగితేనే .. బీజేపీ. .. కేంద్రం.. చిత్తశుద్ధిపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close