ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియాకు నో బెయిల్

రూ. 338 కోట్ల రూపాయల లావాదేవీలపై ఆధారాలను ఈడీ సమర్పించినందున ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ పిటిషన్ పై గతంలోనే విచారణ పూర్తయింది. ఇవాళ తీర్పు వెలువరించింది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న కేసులపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, సిసోడియాపై ఉన్న కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో సీబీఐ, ఈడీలకు పలు ప్రశ్నలు సంధించింది. మద్యం కుంభకోణానికి సంబంధించి సిసోడియా ఫిబ్రవరి నుంచి జైలులో ఉన్నారు. సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో వాదనలు వినింది. తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. తనపై రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని సిసోడియా కోరారు. సిసోడియాపై విచారణను ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. విచారణ ప్రక్రియ మందకొడిగా కొనసాగితే సిసోడియా మూడు నెలల్లోగా మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో చాలా మందిని ఈడీ, సీబీఐ అరెస్టు చేసింది. సౌత్ లాబీ నుంచి చాలా మందిని అరెస్టు చేశారు. మనీ రూటింగ్ జరిగిందని చార్జిషీట్లలో పేర్కొన్నారు. అయితే దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారు. ఒక్క కవిత మాత్రమే బయట ఉన్నారు. ఆమెపై విచారణను నవంబర్ వరకూ సుప్రీంకోర్టు ఆపేసింది. ముందు ముందు ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close