జీతేర‌హో ఇండియా: ఈసారి బౌల‌ర్ల వంతు

ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో వ‌రుస‌గా 6వ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకొంది టీమ్ ఇండియా. అయితే ఈసారి మ్యాచ్‌ని బౌల‌ర్లు గెలిపించారు. 230 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త జ‌ట్టు కాపాడుకోవ‌డం, వంద ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకోవ‌డం నిజంగా.. అద్భుత‌మే. బౌల‌ర్ల‌కు అనుకూలించిన ఈ పిచ్‌పై… బూమ్రా, ష‌మీ, కుల‌దీప్ చెల‌రేగిపోయారు. ప్ర‌పంచ ఛాంపియ‌న్‌ని మ‌ట్టి క‌రిపించారు. ఈఓట‌మితో.. ఇంగ్లండ్ ఇంటికి వెళ్ల‌డంతో పాటుగా మ‌నం సెమీస్‌కి ద‌ర్జాగా అడుగుపెట్ట‌డం కూడా ఖాయ‌మైపోయాయి. అయితే ఇలాంటి పిచ్‌పై కూడా రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ చేసిన విధానాన్ని గుర్తు పెట్టుకోవాల్సిందే. ఎప్పుడూ దూకుడుగా ఆడే రోహిత్.. ఈ సారి సంయ‌మ‌నంతో బ్యాటింగ్ చేశాడు.తృటిలో సెంచ‌రీ (87) కోల్పోయినా… సెంచ‌రీ కంటే గొప్ప ఇన్నింగ్స్ ఇది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అద్భుత‌మైన ఫామ్ లో ఉన్న ఇండియ‌న్ కెప్టెన్‌.. మ‌రోసారి సూప‌ర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి (0) నిరాశ ప‌రిచినా, రాహుల్‌, సూర్య కుమార్ త‌ప్ప మిగిలిన వాళ్లెవ్వరూ రాణించ‌లేక‌పోయినా, ప్ర‌తి కూల ప‌రిస్థితుల్లో జ‌ట్టు స్కోరు 200 దాటించాడు. చివ‌ర్లో బూమ్రా, కుల‌దీప్ జోడించిన విలువైన ప‌రుగుల్ని మ‌ర్చిపోకూడ‌దు. మొత్తానికి ఈ వ‌రల్డ్ క‌ప్ లో భార‌త్ త‌న చైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోంది. సెమీస్ లో కూడా ఇదేర‌క‌మైన ఆట తీరు ప్ర‌ద‌ర్శిస్తే.. క‌ప్ మ‌న‌దే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close