ఈనెలలోనే కొణతాల బ్యాచ్ తెదేపాలో చేరిక

మాజీ మంత్రి మరియు మాజీ వైకాపా నేత కొణతాల రామకృష్ణ వైకాపాను విడిచిపెట్టి అప్పుడే రెండేళ్ళు పూర్తికావస్తున్నా ఇంతవరకు ఏ పార్టీలోను చేరలేదు. ఆయన తెదేపాలో చేరుతారని మీడియాలో చాలాసార్లు వార్తలు వచ్చేయి కానీ స్థానిక తెదేపా నేతల అభ్యంతరాల కారణంగా చేరలేకపోయినట్లు తెలుస్తోంది. ఈసారి ఆయన సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి స్వయంగా తాము ఈ మార్చి నెలలోనే తెదేపాలో చేరబోతున్నట్లు నిన్న మీడియాకు చెప్పారు కనుక ఈసారి వాళ్ళ బ్యాచ్ తెదేపాలో చేరిక ఖాయమనే నమ్మవచ్చును.

ఆయన మరో బాంబు లాంటి వార్తను కూడా పేల్చారు. తమతో బాటు అరుకు వైకాపా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు కూడా తెదేపాలో చేరబోతున్నట్లు చెప్పారు. ఆయనతో మరికొంత మంది వైకాపా నేతలు కూడా తెదేపాలో చేరబోతున్నట్లు చెప్పారు. అదే నిజమయితే సర్వేశ్వర రావుతో కలిపి కేవలం నెల రోజుల వ్యవధిలో మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరినట్లవుతుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే కొణతాల రామకృష్ణకి టికెట్ ఇచ్చి పార్టీలో చేర్చుకొంతారని ప్రచారం జరిగింది. కానీ అప్పుడూ ఎమ్మెల్సీ సీటు కోసం పార్టీలో తీవ్రమయిన పోటీ నెలకొని ఉన్నందున ఆయనకు ఆ అవకాశం దక్కలేదని తెలుస్తోంది. మరిప్పుడు ఆయనను పార్టీలోకి తీసుకొంటే ఏ పదవి ఆఫర్ చేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close