షర్మిలకు తెర వెనుక సపోర్టుగా లగడపాటి !?

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హఠాత్తుగా రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యారు. ఆయన మాజీ ఎంపీలు ఉండవల్లితో పాటు హర్షకుమార్ తో విడివిడిగా సమావేశం అయ్యారు. లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. ఆ మాట మేరకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు. వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే ఏపీకి వచ్చినప్పుడు మాత్రం రాజకీయ స్నేహితుల్ని కలుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆయన రాజకీయంపై చర్చ జరుగుతూ ఉంటుంది. షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసిన తర్వాత లగడపాటి రాజగోపాల్ రాజమండ్రికి రావడం ఇద్దరు సీనియర్ మాజీ ఎంపీలతో సమావేశం కావడం సహజంగానే ఆసక్తి రేపుతోంది.

హర్షకుమార్ కాంగ్రెస్ లోనే ఉన్నారు. కానీ ఆయన యాక్టివ్ గా లేరు. పీసీసీ చీప్ పదవిని ఆశించారు కానీ దక్కలేదు. షర్మిలను చీఫ్‌గా చేస్తారన్న ప్రచారం తర్వాత ఆయన వ్యతిరేకంగా స్పందించారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఊడిగం చేయడానికే ఏపీ కాంగ్రెస్ ఉందా అని ప్రశ్నించారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఏ పార్టీలో లేరు. జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నా ఓ పదవి ఇవ్వాలన్న ఆలోచన జగన్‌కు రాలేదు. ఇప్పుడు హర్ష కుమార్ తో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ ను మళ్లీ కాంగ్రెస్ లో యాక్టివ్ అయ్యేలా చూసేందుకు వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఒప్పించేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

షర్మిలకు మద్దతుగా సైలెంట్ గా ఉండిపోయిన కాంగ్రెస్ నేతల్ని లగడపాటి తెరపైకి తెస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే లగడపాటి రాజగోపాల్ మాత్రం.. అలాంటిదేమీ లేదంటున్నారు. ఎప్పుడు రాజమండ్రి వచ్చినా హర్ష కుమార్ ను.. ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలవడం సహజమేనని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు తెర వెనుక ఏంజరుగుతుందో అంచనా వేయడం కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close