150 సీ బేరం : ఎమ్మెల్యేను టీడీపీ లోకి వెళ్ళిపొమ్మన్న జగన్

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నదని వైసీపీ ఫిరాయింపుల మొదలైన నాటినుంచి ఆరోపిస్తూనే ఉంది. అక్రమంగా సంపాదించిన కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి అయినా సరే వైసీపీ ని దెబ్బ తీయడానికి  కుట్రలు చేస్తున్నాడని జగన్ అండ్ కో అంటూనే ఉన్నారు. ఒక్కొక్కరు పది ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు, ఎలాంటి ఆర్ధిక ప్రయోజనం లేకుండా టీడీపీ లోకి ఎందుకు వెళతారు…? అని లాజికల్ గా ఆలోచించగలిగిన కొందరు, మరియు, జగన్ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఈ ఆరోపణలను నమ్ముతారు కూడా. అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన పుకారు తాజాగా హల్చల్ చేస్తున్నది. అదేమిటంటే కేవలం ఒక ఎమ్మెల్యేను తమ పార్టీ లోకి ఆకర్షించడానికి టీడీపీ వారు 150 కోట్ల రూపాయలు ఆఫర్ చేసారన్నది.

ఇందులో నిజానిజాలు సంగతి ఎవరికీ తెలియదు గానీ, మొత్తాన్ని గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు ఈ మేరకు 150 కోట్ల సాలిడ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తున్నది. కేవలం ఒక ఎమ్మెల్యే కోసం అంత భారీ ఆఫర్ ఇస్తారా ? టీడీపీ ఏమి సంఖ్యాబలం కొరత లో లేదు కదా  అని ఎవరికైనా అనుమానం కలగవచ్చు. అయితే ఈ ఎమ్మెల్యేకు మాత్రం ఇంత భారీ ఆఫర్ రావడానికి ఒక కారణం ఉంది. ఆయన గుంటూరు జిల్లాకు చెందినా ఎమ్మెల్యే,  ఆర్థికంగా బాగా సంపన్నుడని కూడా పేరు ఉంది. సాక్షి చేసిన కథానాల్లో కీలకమైన చాలా సమాచారాన్ని అయన పోగేసి తెచ్చి ఇచ్చారని అనుకుంటున్నారు. ఆయన తన సొంత డబ్బు ఖర్చు పెట్టి, డాక్యుమెంట్లు సకలం సంపాదించారని వాటిని దగ్గరుంచుకుని సాక్షి చెలరేగిపోతున్నదని అంటున్నారు. అయితే ఈ భూదందా లు బయటకు రావడంలో కీలకంగా ఉన్న ఆ ఎమ్మెల్యే ను కొనేయడానికి టీడీపీ ప్రయత్నించినట్లు సమాచారం. 150 కోట్ల ఆఫర్స్ తో అయన మామ ద్వారా ప్రతిపాదన పంపినట్లు పుకారు.

అయితే ఈ ఎపిసోడ్ లో సెకండ్ పార్ట్ ఏమిటంటే టీడీపీ ఆఫర్ గురించి జగన్ కు చెప్పదానికి సదరు ఎమ్మెల్యే లోటస్ పాండ్ కు వచ్చారుట. టీడీపీ వాళ్ళు ఇంత ఇస్తామన్నారు అని అంటే జగన్ కూడా ఒక ఆఫర్ చెబుతాడాని అయన ఆశించారో ఏమో తెలియదు గానీ, వచ్చి చెప్పారుట.  అయితే జగన్ చాలా వెరైటీ గా  “డబ్బు వస్తోంటే వద్దనడం ఎందుకు.. తీసుకుని పార్టీ మారిపో అన్నా నువ్వు మన వాడివి ఎక్కడ వుంటే ఏముంది !” అని అన్నాడుట. దీనితో ఖంగు తిన్న సదరు ఎమ్మెల్యే  ” లేదు లేదు పార్టీ మరే ఉద్దేశం నాకు లేదు.. ఊరకే మీకు సమాచారం చెబుదామని వచ్చా”  అని వెళ్ళిపోయాడుట. అదీ సంగతి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close