సికింద్రాబాద్ లో కిషన్ వర్సెస్ తలసాని వర్సెస్ దానం !

సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం దిగ్గజాలు పోటీ పడబోతున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేయడం ఖాయం. ఆయనకు ప్రత్యర్థులు ఎవరు అన్నానిపై నిన్నామొన్నటి వరకూ స్పష్టత లేదు. కానీ ఇప్పుడు గ్రేటర్ పరిధిలో కీలక నేతలుగా ఉన్న వారే పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున దానం నాగేందర్, బీఆర్ఎస్ తరపున తలసాని పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో సికింద్రాబాద్ పోరు హోరాహోరీగా సాగనుంది.

సికింద్రాబాద్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంది. గత రెండు సార్లు బీజేపీ గెలిచింది. మజ్లిస్ పోటీ చేస్తే బీజేపీకి తిరుగులేని విజయం దక్కుతుంది. కానీ గతంలో బీఆర్ఎస్ అవగాహన మేరకు మజ్లిస్ పోటీ చేయలేదు. ఈ సారి కాంగ్రెస్ తో మజ్లిస్ ఆ మేరకు అవగాహన పెట్టుకునే అవకాశం ఉంది. సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ ఎంపిక చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచించడంలోనే ప్రత్యేకమైన వ్యూహం ఉందని భావిస్తున్నారు. తన కుమారుడికి సీటు కోసం తలసాని ప్రయత్నిచినా హైకమాండ్ ఆయననే బరిలోకి దించాలని అనుకుంటోంది.

ఇటీవల అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో సికింద్రాబాద్ పరిధిలో ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఒక్క చోట మజ్లిస్ గెలిచింది. ఆ ఆరింటిలో ఖైతరాబాద్ కూడాఉంది. ముషీరాబాద్, అంబర్ పేట, జూబ్లిహిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్ లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నాంపల్లిలో మజ్లిస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఈ సారి ముస్లిం ఓటర్ల మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న సమయంమలో … ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఎలా చూసినా ఈ సారి కిషన్ రెడ్డికి అంత సులువైన రాజకీయం కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close