బ‌న్నీ సినిమా… ‘బ్యాన‌ర్‌’ లొల్లి

‘పుష్ష 2’ త‌ర‌వాత‌ అల్లు అర్జున్ సినిమా ఫిక్స‌యిపోయింది. అట్లీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అయితే.. ఇంకా తేలాల్సిందేంటంటే… ఈ సినిమా ఏ బ్యాన‌ర్ లో చేయాలి? అన్న‌దే. బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సివుంది. కానీ రాలేదు. దానికి కార‌ణం.. బ్యాన‌ర్ విష‌యంలో క్లారిటీ రాక‌పోవ‌డ‌మే.

అట్లీ… ఇప్పుడు స‌న్ పిక్చర్స్ సంస్థ‌లో ఓ సినిమా చేయాలి. బ‌న్నీ సినిమాని అదే బ్యాన‌ర్‌లో చేయాల‌ని త‌ను భావిస్తున్నాడు. అయితే కాంబినేష‌న్ ప‌రంగా ఉన్న క్రేజ్ ని చూసి, గీతా ఆర్ట్స్ ఈ సినిమాని సొంతంగా చేయాల‌ని అనుకొంటోంది. దానికి అట్లీ అభ్యంత‌రం చెబుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆల్రెడీ స‌న్ కి మాట ఇచ్చేశాడు కాబ‌ట్టి, అట్లీకి మ‌రో మార్గం లేదు. బన్నీ మాత్రం ఈ సినిమాని ఓన్ బ్యాన‌ర్‌లో చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంద‌ని అనుకొంటున్నాడు. అక్క‌డే డిస్క‌ర్ష‌న్స్ జోరుగా న‌డుస్తున్నాయి. మ‌ధ్యే మార్గంగా స‌న్ పిక్చ‌ర్స్ తో పాటుగా, గీతా ఆర్ట్స్ క‌లిసి ఈ సినిమా చేసే ఛాన్సుంది. ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమాని అలానే పూర్తి చేశారు. హారిక హాసినితో పాటు గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పుడు కూడా అదే ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close