బీజేపీ మేనిఫెస్టో : 14 స్లోగన్లు – ఐదేళ్లు ఉచిత రేషన్

లోక్‌సభ ఎన్నికలకోసం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సంకల్ప పత్రం’ పేరుతో ప్రజల ముందుకు తమ ఎన్నికల హామీలను తీసుకొచ్చింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ ఆదివారం మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్ తో మొత్తం 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు.

మరో ఐదేళ్లు ఉచిత రేషన్ ఇస్తామని మోదీ ప్రకటించారు. అలాగే 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ లో భాగంగా రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్యం, ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు, దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం, ట్రాన్స్ జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్, 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు, కూరగాయల సాగు, నిల్వ కోసం కొత్త క్లస్టర్లు నిర్మిస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం, మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు వంటి కీలక హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించింది.

ఈ మేనిఫెస్టో రూపకల్పన కోసం దాదాపు 15 లక్షల సలహాలు, సూచనలు పరిశీలించింది. తర్వాత పధ్నాలుగు స్లోగన్లను కూడా ఇచ్చారు. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సాంకేతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, సంతులిత అభివృద్ధి, క్రీడా వికాసం, సుస్థిర భారత్ అంటూ చెప్పుకొచ్చారు.

ప్రజలకు నేరుగా ప్రయోజనం పొందే పథకాలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రాధాన్యం ఇవ్వగా.. ఇప్పటికే ఇస్తున్న ఉచిత రేషన్ పొడిగింపు.. అభివృద్ధి పనుల కొనసాగింపే తమ మేనిఫెస్టో అన్నట్లుగా బీజేపీ ప్రకటించుకుంది. స్లోగన్లు మాత్రం ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close