వైసీపీకి పక్కాగా ట్రాప్‌లోకి లాగేసిన షర్మిల !

రాజకీయంలో విజయం ఎక్కడ ఉంటుందంటే.. వారి ఎజెండాలోకి ఇతర పార్టీని లాగేసినప్పుడే వస్తుంది. వైఎస్ షర్మిల ఈ విషయంలో అన్న జగన్ మోహన్ రెడ్డిని మించిపోయారు. వైఎస్ వివేకా హత్య కేసు కేంద్రంగా కడపలో.. రాష్ట్రంలో రాజకీయం మారిపోవాలని ఆమె వేసిన ట్రాప్ లో వైసీపీ పడిపోయింది. మేనత్తను దించి… చెల్లెళ్లపై ఎెదురుదాడి చేయించడంతో నిండా కూరుకుపోయారు. ఇక ఈ రచ్చ ఆగదు. ప్రతీ ఆరోపణకూ వైసీపీ సమాధానం చెప్పాల్సిందే. కడపలో ప్రచారం చేసిన ప్రతీ సారి జగన్ కూడా నోరు విప్పాల్సిందే.

షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మొదటి అడుగులో అవినాష్ రెడ్డిని నేరుగా హంతకుడిగా అభివర్ణించారు. అలా అన్న తర్వాత అవినాష్ రెడ్డి మనిషి పుట్టుక పుట్టలేదని తిట్టారు. వెంటనే షర్మిల తనను వైఎస్ కు పుట్టులేదంటున్నారని రాజకీయ విమర్శలు చేశారు. తర్వాత కొంగు పట్టుకుని అడుగుతున్నా న్యాయం చేయలని ప్రజల్ని అడిగారు. అలా అడిగితే ప్రజలు కరిగిపోతారని అర్థమైన వెంటనే… విమలారెడ్డిని రంగంలోకి దింపారు. కానీ షర్మిల వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఈ బాధ అంతా ఎందుకని అవినాష్ రెడ్డిని మార్చాలని జగన్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వెంటనే షర్మిల ఈ అంశంలోనూ జగన్ ఆలోచనలకు బ్రేక్ వేసేలా ప్లాన్ చేసుకున్నారు. మారుస్తున్నారంటే.. జగన్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డినే హంతకుడని అంగీకరించినట్లే కదా అంటున్నారు.

షర్మిలకు వైసీపీ స్పందన ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. ఆమె సోదరి, వివేకా కుమార్తె సునీతతో కలిసి .. అన్యాయమైపోయిన ఆడబిడ్డమని అండగా ఉండాలని కోరుతూ ప్రచారం మరింత ఉద్ధృతం చేయనున్నారు. ఇప్పుడు షర్మిల, సునీత చేస్తున్నప్రతి విమర్శకు కౌంటర్ గా సమాధానం ఇవ్వాల్సిందే. అది ప్రజల్లో మరింత చర్చకు కారణం అవుతుంది. అదే సమయంలో ఏమీ మాట్లాడకపోతే వారు చేస్తున్న ఆరోపణలు నిజమనుకునేవారి సంఖ్య పెరుగుతుంది. ఈ అంశాన్ని రాజకీయ ఎజెండాగా మార్చాలనుకున్న షర్మిల ప్లాన్ లో వైసీపీ తప్పక భాగం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close