కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ…ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో ఎన్నికల ప్రణాలికలను రిలీజ్ చేశాయి. రెండు పార్టీలు కూడా మహిళలు, రైతులు, యువత సంక్షేమమే లక్ష్యంగా తమ మేనిఫెస్టోలను రూపొందించాయి.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పేపర్ లీకులు జరుగుతుండటంతో పేపర్ లీక్ లకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అలాగే, ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొంది. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దుతామని…అలాగే ఔత్సాహికులకు ముద్ర రుణాల పరిమితిని 20 లక్షలకు పెంచుతామని తెలిపింది. నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని యువ న్యాయ్ కార్యక్రమం అమలు చేస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది.

చట్ట సభల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును క్రమ పద్దతిన అమలు చేస్తామని వెల్లడించింది బీజేపీ. మహిళలను లక్షాధికారులు చేసేందుకు చర్యలు చేపడుతామని పేర్కొంది. ప్రతి పేద కుటుంబంలోని మహిళకు ఎలాంటి షరతులు లేకుండా ఏడాదికి లక్ష రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపింది.

కనీస మద్దతు ధరను పెంచుతామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇప్పటికే ఇస్తోన్న ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజనను కొనసాగిస్తామని వెల్లడించింది.పంటకు మద్దతు ధర కల్పిస్తామని, వ్యవసాయ ఫైనాన్స్ పై శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

బీజేపీ మేనిఫెస్టో ప్రతిపక్ష పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను తలపిస్తోందని సెటైర్లు వేస్తున్నారు. అధికారంలో ఉండి మరోసారి అధికారంలోకి వస్తే ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొనటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పదేళ్ళుగా కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్లు ఉన్నప్పటికీ ఎందుకు పట్టించుకోలేదంటున్నారు. రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులను కాల్చి చంపిన బీజేపీ సర్కార్…పంటలకు కనీస మద్దతు ధరపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న పెదవి విరుపులు ఉత్తరాది రాష్ట్రాల నుంచి మొదలు కావడం గమనార్హం. రైతులకు రుణాలను మాఫీ చేయని కేంద్రం కార్పోరేట్లకు వేల కోట్ల రుణాలను ఎలా మాఫీ చేసిందని ఈసారి బీజేపీని నమ్మి మోసపోమని రైతులు తేల్చి చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close