జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం ఐదుగురు ద‌ళితుల శిరోముండ‌నం కేసులో కోర్టు తీర్పు వెలువ‌రించింది.

హైకోర్టు సూచ‌న‌తో కేసును విచారించిన దిగువ కోర్టు… తోట త్రిమూర్తులు స‌హా మొత్తం 10మందిని దోషులుగా తేల్చింది. ఇందులో ఒక‌రు ఇప్ప‌టికే మ‌ర‌ణించారు.

తోట త్రిమూర్తులుకు ఒక సెక్ష‌న్ లో 18నెల‌ల జైలు శిక్ష‌తో పాటు ల‌క్షా యాబై వేల జ‌రిమానా కూడా విధిస్తూ తీర్పునిచ్చింది.

1996, డిసెంబ‌ర్ 26న వెంక‌టాయ‌పాలేంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఎన్నిక‌ల క‌క్ష‌తో ఐదుగురు ద‌ళితుల‌కు శిరోముండ‌నం చేశార‌ని కేసు న‌మోదైంది. అయితే, 1998లో ఇది అక్ర‌మ కేసు అని ఆనాడు కేసు కొట్టివేయ‌గా, 2000 సంవ‌త్స‌రంలో ప్ర‌భుత్వం కేసును రీఓపెన్ చేసింది. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 146సార్లు వాయిదా ప‌డుతూ కేసు విచార‌ణ సాగిన తర్వాత విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు తుది తీర్పు వెలువ‌రించింది.

అయితే, తోట త్రిమూర్తుల శిక్ష విష‌యంలో మీరేమైనా చెప్ప‌ద‌ల్చుకున్నారా అని న్యాయ‌మూర్తి అడ‌గ్గా… న‌న్ను రాజ‌కీయం దెబ్బ‌తీసేందుకే ఇదంతా అని వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. నేను ఇన్ని సంవ‌త్స‌రాలుగా ఎంతో మనోవేధ‌న‌ను అనుభ‌వించాన‌ని, 87 రోజుల పాటు రిమాండ్ లో కూడా ఉన్నాన‌న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close