తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా హాజరు కాలేదు. కొద్ది రోజులుగా తలసాని వ్యవహారం తేడాగా ఉంది.

కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్ని.. తెలంగాణ బాపు కేసీఆర్ అంటూ ఓ రేంజ్ లో నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత ఒక్క సారిగా చల్లబడిపోయారు. సికింద్రాబాద్ నుంచి తన కుమారుడికి సీటు కోసం ఆయన ఆ హంగామా చేశారు. పరిస్థితి తెలిసి వచ్చే సరికి ఆయన కుమారుడికి సీటు అవసరం లేదని ప్లేటు ఫిరాయించారు. అయితే తలసానినే పోటీ చేయమని కేసీఆర్ అడిగితే.. నిర్మోహమాటంగా నో చెప్పేశారు. దాంతో .. చివరికి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును ఖరారు చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు నియోజకవర్గంలో తలసాని తిరగడం లేదు. పట్టించుకోవడం లేదు. రెండు రోజుల కిందట ఆయన అయోధ్య నుంచి రాముడ్ని దర్శించుకున్నట్లుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో పెట్టారు. కొద్ది రోజులుగా ఆయన బీ జేపీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పరోక్షంగా ఆయన బీజేపీకే సహకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. తలసానితో పాటు ఆయన కుమారుడు సాయికిరణ్ కూడా హాజరు కాలేదు. తమకు సమావేశం గురించి తెలియదని.. ఆహ్వానం రాలేదని ఆయన చెబుతున్నారు. తలసాని కొడుకు సమాధానం బట్టి.. బీఆర్ఎస్ కు ఇక తలసాని దూరమైనట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close