వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ప్రకటించారు. నాలుగేళ్లుగా రాజధానిపై కాలయాపన చేసిన జగన్ మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగానైనా పరిపాలన కొనసాగిస్తారా.? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.

2014లో ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏపీకి రాజధానిగా అమరావతిని నాటి టీడీపీ సర్కార్ నిర్ణయించింది. కానీ,2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా ప్రకటించింది. నాలుగేళ్లు అవుతున్నా రాజధానుల విషయంలో వైసీపీ సర్కార్ ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది.

మూడు రాజధానుల పేరుతో ఉన్న ఒక్క రాజధానిని కూడా లేకుండా చేశారని నాలుగేళ్లుగా జగన్ సర్కార్ పై ఏపీ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. ఖండంతారాల్లో ఉన్న ఏపీ వాసులు కూడా జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై పెదవి విరిచారు. ఎన్నికల్లో మూడు రాజధానుల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారని జగన్ సర్కార్ పై సొంత చెల్లి షర్మిలతో సహా ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

ఇది వైసీపీకి ఎన్నికల్లో ప్రతిబంధకంగా మారుతుందని అంచనా వేశారేమో కానీ, మేనిఫెస్టో విడుదల సందర్భంగా వైసీపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక విశాఖ కేంద్రంగా పరిపాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దసరా నాటికి విశాఖ వేదికగా పరిపాలన అంటూ వైసీపీ నేతలు ఊదరగొడుతూ వచ్చినా అది సాధ్యం కాలేదు. చట్టపరంగా మూడు రాజధానులు సాధ్యం కాదని తెలిసినా మేనిఫెస్టోలో చేర్చడం ఆశ్చర్యపరుస్తోంది.దాంతో మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజధాని విషయంలో ముందడుగు పడేనా అంటూ జనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్.. ముహూర్తం కుదిరింది!

ఎన్టీఆర్ త‌దుప‌రి సినిమా ఏమిట‌న్న విష‌యంపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింది. 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వంలో ఎన్టీఆర్ తో మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. 'దేవ‌ర‌' త‌ర‌వాత ఎన్టీఆర్ న‌టించే...

“డిపార్టుమెంట్”పై నమ్మకం మళ్లీ ఎలా పెంచుకోగలరు !?

నేరపూరిత మనస్థత్వం ఉన్న వ్యక్తి చేతుల్లోకి న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు వెళ్తే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో గత ఐదేళ్లుగా ఏపీ చూసింది. బాధితులు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఒక్క...

ఈవారం బాక్సాఫీస్‌: ప్రేక్ష‌కుల మూడ్ మారుతుందా?

మొన్న‌టి వ‌ర‌కూ ఎన్నిక‌ల ఫీవ‌ర్ తో వ‌ణికిపోయారు తెలుగు ప్రజ‌లు. దాంతో సినిమాల గురించి పెద్ద‌గా పట్టించుకొనే స‌మ‌యం దొర‌క‌లేదు. బాక్సాఫీసు ముందుకు చిన్నా, చిత‌కా సినిమాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటికి ఆద‌ర‌ణ క‌రువైంది....

కాంగ్రెస్ జిల్లాల జోలికెళ్తే బీఆర్ఎస్‌ చేతికి సెంటిమెంట్ అస్త్రం !

తెలంగాణలో రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన జిల్లాలతో పాలనా పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో జిల్లాలో ఇద్దరు, ముగ్గురు జడ్పీటీసీలు లేని పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close