హమ్మయ్యా….పాకిస్తాన్ మనల్ని కరుణించింది

హమ్మయా… పాకిస్తాన్ మనల్ని కరుణించింది. ఐ.సి.సి. బి.సి.సి.ఐ.,బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, భారత్ హోమ్ శాఖ, కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ చేసుకొన్న మొరనాలకించి పాకిస్తాన్ ప్రభుత్వం తమ క్రికెటర్లను భారత్ కి పంపించడానికి అంగీకరించింది. హోం శాఖ కార్యదర్శి రాజీవ్ డిల్లీలోని పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ ని కలిసి పాక్ ఆటగాళ్ళకు భద్రత కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొన్న జాగ్రత్తలు, చేసిన ఏర్పాట్ల గురించి వివరించిన తరువాత, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాక్ ప్రభుత్వం తమ ఆటగాళ్ళను భారత్ పంపడానికి అంగీకరించింది.

భారత్-పాక్ జట్టులు టి20లో భాగంగా కోల్ కతాలో రెండు మ్యాచ్ లు, గుజరాత్ లోని మొహాలీలో రెండు మ్యాచ్ లు ఆడుతాయి. ఈరోజు రాత్రికే పాక్ జట్టు డిల్లీ లేదా కోల్ కతా చేరుకొనే అవకాశం ఉంది. భారత్ విదేశాంగ శాఖ మరియు బి.సి.సి.ఐ. పాక్ క్రికెట్ బోర్డు, పాక్ ప్రభుత్వంతో టచ్చులో ఉంటూ పాక్ ఆటగాళ్ళ ప్రయాణం గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకొంటున్నాయి. ఇక వారు రావడమే ఆలస్యం వారికి ఘనస్వాగతం పలికేందుకు అధికారులు సిద్దంగా ఉన్నారు.

కొస మెరుపు: ఈ టోర్నీలో ఆడకపోతే తాము 15 మిలియన్ డాలర్లు నష్టపోతామని పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ శార్యార్ ఖాన్ మీడియాకు చెప్పారు. పాక్ క్రికెట్ బోర్డు అంత నష్టాన్ని భరించే స్థితిలో లేదని అన్నారు. అంటే భారత్ తో ఈ మ్యాచ్ లు ఆడటం దానికీ అత్యవసరమని అర్ధమవుతోంది. అందుకే తమ క్రికెటర్లను భారత్ పంపిస్తున్నప్పటికీ, భారత్ మొరనాలకించి తమ ఆటగాళ్ళను పంపిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం మంచి బిల్డప్ ఇవ్వగలిగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close