చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్న ఈడి

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా వ్యవహారంలో ఈ.డి.అధికారులు ఇప్పుడు తాపీగా కేసులు నమోదు చేయడం చూస్తుంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లుంది. ఇంకా మోటుగా చెప్పాలంటే దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లుంది. అది కూడా ఈడి తను స్వయంగా కనిపెట్టిందేమీ లేదు. ఆయన వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్న సిబీఐ గత ఏడాది దాఖలు చేసిన ఒక ఎఫ్.ఐ.ఆర్. ఆధారంగా కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఏ. రఘునందన్, మరి కొందరు ఉన్నతాధికారులు, వారి సంస్థకు చట్ట వ్యతిరేకంగా రూ.600 కోట్లు అప్పులిచ్చిన ఐ.డి.బి.ఐ.బ్యాంక్ అధికారులకు ఈ.డి.అధికారులు మనీ లాండరింగ్ చట్టంలో పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేసి, నోటీసులు జారీ చేసారు. విజయ్ మాల్యాతో సహా అందరూ వారి వ్యక్తిగత, మరియు సంస్థల గత ఐదేళ్ళ ఆదాయ, ఐటి రిటర్న్స్ వివరాలతో రెండు వారాలలోగా తమ ముందు హాజరవ్వలని ఆదేశిస్తూ అందరికీ ఈడి అధికారులు నోటీసులు పంపారు.

ఈ కేసులో ప్రశ్నించేందుకు ఐ.డి.బి.ఐ.బ్యాంక్ మాజీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ యోగేష్ అగర్వాల్ టో సహా మరో ఆరుగురు సీనియర్ అధికారులకు కూడా ఈ.డి. అధికారులు నోటీసులు జారీ చేసారు. వారిలో ఏ. రఘునందన్, కింగ్ ఫిషర్ కి చెందిన మరి కొందరు ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం ముంబైలోని ఈ.డి. అధికారుల ముందు హాజరయ్యారు. “కింగ్ ఫిషర్ పతనానికి మూలకారకుడు ఆ సంస్థ అధినేత విజయ్ మాల్యాయేనని, తనతో సహా అధికారులు అందరూ ఆయన ఆదేశాల మేరకే పనిచేసేవారమని” రఘునందన్ ఈ.డి. అధికారులతో చెప్పారు.

విజయ్ మాల్యా అప్పుల వ్యవహారం ఈరోజు కొత్తగా మొదలయిందేమీ కాదు. ఆయన ఆదాయ, వ్యయాలు, లాభ నష్టాలు, ఆర్ధిక లావాదేవీల గురించి ఆదాయపన్ను శాఖకు ఎప్పటి నుండో తెలుసు. తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న కారణంగా ఆయన తన కింగ్ ఫిషర్ విమాన సంస్థ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడి, చివరికి కింగ్ ఫిషర్ మూలపడింది. అటువంటి పరిస్థితులలో కూడా ఆయన చాలా విలాసవంతమయిన జీవితం గడిపేవారని, తరచూ విదేశీయానాలు కూడా చేసేవారని దేశంలో అందరికీ తెలుసు. కానీ ఈ విషయాలన్నీ ఈ.డి.అధికారులకి మాత్రమే తెలియదనుకోవాలేమో? లేదా తెలిసీ ఇంతకాలం ఉపేక్షించారంటే దానర్ధం ఏమిటో? ఆయన దేశం విడిచి పారిపోయేవరకు మౌనంగా చూస్తూ కూర్చొని ఇప్పుడు హడావుడిగా ఆయనపై కేసులు నమోదు చేయడాన్ని ఏమనుకోవాలి?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close