సెల్ఫీ రాజాగా అల్లరి నరేష్..!

అసలు తెలుగు పరిశ్రమకు స్పూఫ్ లు వాడటం.. స్టార్ హీరోలను ఇమిటేట్ చేసి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించడం మొదలుపెట్టింది అల్లరి పిడుగు మన అల్లరి నరేష్. తండ్రి కామెడీ సినిమాలను డైరెక్ట్ చేస్తే తాను తన నటనతో ప్రేక్షకులకు కితకితలు పెడతానని అల్లరి సినిమాతో తెరంగేట్రం చేసి నవ్వుల పండుగ చేసుకుంటున్నాడు. అయితే కెరియర్ మొదట్లో మంచి జోష్ మీదున్న నరేష్ అప్పట్లో సంవత్సరానికి 7 నుడి 8 సినిమాల దాకా చేసి రిలీజ్ చేసేవాడు. ఇప్పుడు కనీసం రెండు సినిమాలను కూడా రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కొంతకాలంగా కొత్త రక్తం ఇండస్ట్రీకి పరిచయమవడం తాను వేసిన రెడ్ కార్పెట్ లో గోల్డెన్ లెగ్ తో వెళ్తున్నారు.

ఎవరు ఏం చేసినా ఎవరి టాలెంట్ వారిదే అందుకే ప్రేక్షకులకు మరోసారి తన టాలెంట్ తో నవ్వించి కవ్వించాలని చూస్తున్నాడు అల్లరి నరేష్. లాస్ట్ ఇయర్ వచ్చిన జేమ్స్ బాండ్ కూడా నిరాశ పరచడంతో ఇప్పుడు కొత్త సినిమా ‘సెల్ఫీ రాజా’గా రాబోతున్నాడు నరేష్. ప్రస్తుతం ట్రెండ్ సృష్టిస్తున్న సెల్ఫీ ఫోటోల హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఇదే కథాశంతో ఓ సినిమా తీస్తున్నాడు నరేష్. అంతేకాదు ఈ సినిమాతో తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాధించేస్తా అనే నమ్మకాన్ని కూడా వెళ్లబుచ్చుతున్నాడు.

సో సెల్ఫీ రాజాగా వస్తున్న అల్లరి నరేష్ కు ఈ సినిమా ఎన్నాళ్ల నుండో వెయిట్ చేస్తున్న సూపర్ హిట్ కిక్ ను తనకు అందించాలని కోరుకుందాం. సినిమా దర్శకుడు, మిగతా స్టార్ కాస్ట్ ఎవరనేది త్వరలో ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉప్పల్ లో మ్యాచ్ కు వాన గండం..?

మరికొద్ది గంటల్లో హోం గ్రౌండ్ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సి...

అధికారం కోల్పోయినా సరే కానీ… జగన్ టార్గెట్ అదే..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా వైసీపీ...

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close