తలసాని రాజీనామాపై స్పందించిన స్పీకర్: ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా వ్యవహారంపై తెలుగుదేశం తీసుకొచ్చిన ఒత్తిడి ఎట్టకేలకు ఫలించింది. స్పీకర్ మధుసూదనాచారి చివరికి స్పందించారు. రాజీనామా లేఖ తనదగ్గరే ఉందని, ఒకటి, రెండు రోజులలో నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తమకు హామీ ఇచ్చినట్లు టీడీపీ నేతలు ఇవాళ తెలిపారు.

తలసాని వ్యవహారంపై తెలంగాణ తెలుగుదేశం నేతలు ఇటీవల ఒత్తిడిని బాగా పెంచిన సంగతి తెలిసిందే. రమణ, ఎర్రబెల్లి, రావుల చంద్రశేఖర్ రెడ్డివంటి తెలుగుదేశం నేతలు నిన్న గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్ళి తలసానిని బర్తరఫ్ చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అయితే విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఏమీ చేయలేనని గవర్నర్ బదులివ్వటంతో వారు రాజ్‌భవన్‌ముందు ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇవాళ వారు తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి నివాసాన్ని ముట్టడించారు. మధుసూదనాచారి ముఖ్యనేతలను ఇంట్లోకి పిలిపించుకుని వారితో మాట్లాడారు. బయటకొచ్చిన తర్వాత ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ, సనత్‌నగర్‌లో తలసాని గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. టీఆర్ఎస్‌లో చేరిన ఇతర టీడీపీ ఎమ్మెల్యేలుకూడా రాజీనామా చేయాలని డిమాండ్ చెేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close