దళితుడి ఇంట్లో రాగిసంకటి తిన్న రాహుల్

హైదరాబాద్: అనంతపురంజిల్లాలో రైతుభరోసా పాదయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి తన మధ్యాహ్న భోజనాన్ని కొండకమర్ల గ్రామంలోని ఒక దళితుడి ఇంట్లో చేశారు. ఉదయం ఓబుళదేవర చెరువునుంచి పాదయాత్ర చేపట్టిన రాహుల్ కొండకమర్లలో దానిని ముగించారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగించినతర్వాత ఆ గ్రామంలోని దళితవాడకు వెళ్ళి రవి అనే దళితుడి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ ఇంట్లోని పిల్లలను పక్కన కూర్చోబెట్టుకుని వారితోబాటుగానే పళ్ళెంలో వడ్డించిన పదార్థాలను చక్కగా ఆరగించారు. భోజనంలో రాహుల్‌‌కు రాగి సంకటి, పప్పు, అన్నం, వడలు వడ్డించారు. ఎలాంటి భేషజాలూ లేకుండా రాహుల్ స్వూన్‌తో అన్ని పదార్థాలనూ తిన్నారు. తర్వాత ఆ ఇంటి గృహిణిని భోజనం బాగుందని మెచ్చుకున్నారు. పిల్లలను పలకరించి వారు ఏమి చదువుతున్నారో తెలుసుకున్నారు. చిరంజీవికూడా రాహుల్‌తోబాటే అక్కడ భోజనంచేశారు. రాహుల్, చిరంజీవి తమ ఇంట్లో భోజనం చేయటంతో ఆ ఇంటివారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ రోడ్ షోలతో కూటమికి మరింత ఊపు !

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి...

ఎలక్షన్ ఎజెండా డిసైడ్ చేసిన రేవంత్ రెడ్డి

ఎన్నికలకు ఎజెండా డిసైడ్ చేసే పార్టీకే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అలాంటి అజెండా డిసైడ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఈ విషయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ముస్లిం రిజర్వేషన్ల...

కేసీఆర్ చెప్తున్న ఆ వ్యాఖ్యలను నమ్మి జనం ఓటేస్తారా..?

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులు పదేపదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఇదే రొటీన్ డైలాగ్ లా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో...

పెద్దిరెడ్డి విశ్వరూపం – వాడిపోతున్న రోజా !

నగరి వైసీపీలో ఐదు మండలాల ఇంచార్జ్‌లతో పాటు ఇతర నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. రోజాను ఘోరంగా ఓడించి .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close