ఆ విషయంలో మేమే గెలిచాము: జగన్

ఊహించినట్లే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు వైకాపాకి మళ్ళీ మరో ఎదురుదెబ్బ తగిలింది. ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్ జరపాలని కోరుతూ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకి లేఖ వ్రాసి, ఆయన అందుకు అంగీకరిస్తారనే భ్రమతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసారు. ఆ విప్ ని తెదేపాలో చేరిన 10 మంది వైకాపా ఎమ్మెల్యేలు ధిక్కరిస్తే వారిపై అనర్హత వేటు వేయించవచ్చని జగన్ భావించారు. కానీ, జగన్ తలిచింది ఒకటయితే స్పీకర్ మరొకటి తలిచారు. జగన్మోహన్ రెడ్డికి మరొకమారు నిరాశ కలిగిస్తూ స్పీకర్ కోడెల ద్రవ్య వినిమయ బిల్లుపై మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేయించారు. తరువాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.

తరువాత జగన్ శాసనసభ బయట ఉన్న మీడియాతో మాట్లాడుతూ “ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తే తెదేపాలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయవలసి వస్తుందనే భయంతోనే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. అంటే నైతికంగా మేమే గెలిచామని స్పష్టం అవుతోంది. వాళ్ళచేత రాజీనామాలు చేయించి ప్రజలలోకి వెళ్ళే ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదు. అందుకనే వారిపై అనర్హత వేటు పడకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొంటున్నారు. దిసీజ్ మోరల్ విక్టరీ ఫర్ అజ్. ఎఫ్.ఆర్.బి.బి.ఎం. చట్ట ప్రకారం రాష్ట్ర జిడిపికి 3శాతం మించి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించడానికి వీలులేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 22,000 కోట్ల డిపాజిట్లు సేకరించింది. అది ముఖ్యమంత్రిని జైలుకి పంపదగ్గ నేరం. ప్రజల నుంచి సేకరించిన ఆ డబ్బుని పక్కదారి పట్టించడం వలన దానిని రాష్ట్ర బడ్జెట్ లో కూడా చూపలేదు. వివిధ పధకాలు, పనుల కోసం చేసిన ఖర్చులకి, ప్రభుత్వం చూపుతున్న లెక్కలలో చాలా వ్యత్యాసాలున్నాయి. అందుకే మేము ద్రవ్య వినిమయ బిల్లుని వ్యతిరేకించాము. దానిపై ఓటింగ్ జరగాలని ప్రధాన ప్రతిపక్షం కోరినప్పుడు నిబంధనల ప్రకారం ఆ అభ్యర్దనను స్పీకర్ అనుమతించవలసి ఉన్నప్పటికీ, ఆయన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రజాస్వామ్యాన్ని తుంగలో త్రొక్కుతూ మూజువాణితో బిల్లును ఆమోదింపజేశారు. ఆయన తన స్పీకర్ స్థానాన్ని కూడా అగౌరవపరిచారు,” అని జగన్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close