ఎన్టీఆర్ ‘లెక్క‌’ త‌ప్పుతున్నాడా??

సినిమా ఎంత పెద్ద హిట్ట‌యినా నిర్మాత‌ల‌కు ఇప్పుడు డ‌బ్బులు మిగ‌ల‌డం లేదు. పేప‌ర్‌పై మాత్ర‌మే.. హిట్టు.. చేతికి ఒక్క పైసా కూడా అంద‌డం లేదు. దానికి కార‌ణం.. ఓవ‌ర్ బ‌డ్జెట్టే! ఓ సినిమాకి మితిమీరి ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల కాస్ట్ ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఎన్టీఆర్‌కీ ఇలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. త‌న బాద్‌షా సినిమాకి హిట్ టాక్ వ‌చ్చినా నిర్మాత‌కు డ‌బ్బులు మిగ‌ల్లేదు. టెంప‌ర్ ప‌రిస్థితీ అంతే. నాన్న‌కు ప్రేమ‌తో వ‌ల్ల నిర్మాత‌కు ఒరిగిందేం లేదు. దానికి కార‌ణం.. ఆయా సినిమాల‌న్నీ బ‌డ్జెట్ ఫెయిల్యూర్సే. త‌న తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్‌కి ఇలాంటి ఇబ్బంది ఏం రాకూడ‌ద‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నాడు ఎన్టీఆర్‌. ఈ సినిమాని రూ.40 కోట్ల‌లోపు పూర్తి చేయాల‌ని నిర్మాత‌ల‌కు ముందే గ‌ట్టిగా చెప్పేశాడు.

అయితే అది ఆచ‌ర‌ణ‌లో సాధ్యం కావ‌డం లేద‌ని టాక్‌. ఈ సినిమా కోసం కొర‌టాల దాదాపుగా రూ.10 కోట్ల పారితోషికం తీసుకొన్నాడు. ఎన్టీఆర్‌కీ అంతే ఉంటుంది. మోహ‌న్‌లాల్ భారీగా పారితోషికం అందుకొన్నాడ‌ని టాక్‌. దేవిశ్రీ ప్ర‌సాద్ ఎప్పుడూ కోటికి త‌గ్గ‌డు. ఇత‌ర కాస్ట్ అండ్ క్రూని లెక్క‌గ‌డితే… మ‌రో ఐదారు కోట్లు ఈజీగా అయిపోతుంది. అంటే.. పారితోషికాల పేరుమీదే రూ.30 కోట్ల ఖ‌ర్చు తేలుతోంది. ఇక ప‌ది కోట్ల‌లో సినిమా ఏం తీయ‌గ‌ల‌డు?? ఇప్ప‌టికి 40 శాతం కూడా షూటింగ్ పూర్తి కాలేదు. కానీ బ‌డ్జెట్ త‌డిసి మోపెడ‌వ్వ‌డం మొద‌లైందట‌. ఈ విష‌యంలో ఎన్టీఆర్ కంగారు ప‌డుతున్నాడ‌ని, అన‌వ‌స‌ర‌మైన హంగామా జోలికి వెళ్ల‌కుండా.. ఉన్న దాంట్లో క్వాలిటీ చూపించ‌మ‌ని అంటున్నాడ‌ట‌. మ‌రి అది సాధ్య‌మ‌య్యే విష‌మేనా?? మ‌రోసారి ఎన్టీఆర్ సినిమా రూ.50 కోట్ల బ‌డ్జెట్ దాటితే… గ్యారెజీ రిజ‌ల్ట్ కూడా డామేజీ అయ్యే ప్ర‌మాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close