ప్ర‌ణీత‌ను ప‌ట్టించుకోరా??

గ్లామ‌ర్ భామ‌ల‌కే తెలుగు చిత్ర‌సీమ‌లో చోటు… అంటుంటారు. అదేంటో… కొంత‌మంది గ్లామ‌ర్ విష‌యంలో విచ్చ‌ల విడిగా అడ్వాన్స్ అయిపోతున్నా… వాళ్ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోరు. ప్ర‌ణీత‌నే తీసుకోండి. అందాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌దు. తెర‌పై ఎలా క‌నిపించాల‌న్నా.. రెడీనే. చిట్టిపొట్టి డ్ర‌సులిచ్చినా వేసుకోవ‌డానికి ముందుకొస్తుంది. అలాంటి ప్ర‌ణీత‌కు తెలుగులో స్థానం ఏది? చేతిలో అత్తారింటికి దారేది లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్టుంది. ప‌వ‌న్ , ఎన్టీఆర్‌ల‌తో చేసిన క్రేజ్ ఉంది. అయినా స‌రే ఈ అమ్మ‌డికి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ విష‌యంలోనే ప్ర‌ణీత తెగ ఫీల‌యిపోతోంద‌ట‌.

తాజాగా మ‌హేష్ బాబు సినిమా బ్ర‌హ్మోత్స‌వంలో న‌టిస్తోంది. ఇందులోనూ ప్ర‌ణీత‌కు అంతంత‌మాత్రంగానే ప్రాధాన్యం ఉంద‌ట‌. ఈ సినిమా కూడా వ‌చ్చి వెళ్లిపోతే… ఇక ప్ర‌ణీత టోట‌ల్ గా ఖాళీనే. ”తెలుగులో నా అవ‌కాశాలేం మూసుకుపోలేదు. నాకంటూ కొన్ని సినిమాలు వ‌స్తున్నాయి. అయితే రెండో నాయిక పాత్ర‌లే ఎక్కువ‌. అవి ఎంత కాలం చేసినా.. నాకంటూ ఓ గుర్తింపు రాదు. అందుకే నో అంటున్నా” అంటోంది. మ‌రి బ్ర‌హ్మోత్స‌వం ఎందుకు ఒప్పుకొన్న‌టో? అని అడిగితే.. ”మ‌హేష్ కోస‌మే ఈ సినిమా చేస్తున్నా. నేను ఆయ‌న‌కు వీరాభిమాని” అంటోంది. ఏహీరో ప‌క్క‌న చేసినా హీరోయిన్లు ఇదే మాట అంటారుగా. అందులో కొత్తేముంది?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ : రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలిసుల నోటిసులు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close