భారత్-పాక్ చర్చలు విఫలం…మళ్ళీ అదే కారణం

డిల్లీలో జరుగుతున్న ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి, భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జయశంకర్ తో నిన్న సమావేశమయ్యారు. వారి సమావేశం పరస్పర ఆరోపణలతో మొదలయ్యి వాటితోనే ముగిసింది. సమావేశం మొదలవగానే పఠాన్ కోట్ దాడులు, ముంబై ప్రేలుళ్ళ గురించి ప్రస్తావించి, వాటికి కారకులైన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తునంత కాలం, ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలని ఆశించడం అత్యాశే అవుతుందని జయశంకర్ చెప్పగా, భారత్-పాక్ సంబంధాలు దెబ్బ తినడానికి ప్రధాన కారణం కాశ్మీర్ సమస్య అని ఐజాజ్ అహ్మద్ చౌదరి వాదించారు. పాక్ లోని బలూచిస్తాన్ లో భారత్ నిఘా సంస్థ ‘రా’ తిరుగుబాటుదారులను ప్రోత్సహిస్తోందని, అలాగే సంజౌతా ఎక్స్ ప్రెస్ ఘటనలో దోషులను పట్టుకొని శిక్షించడానికి భారత్ సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. ఆ ఆరోపణలను జయశంకర్ ఖండించారు. దాదాపు రెండు గంటల పాటు వారి సమావేశం ఇదేవిధంగా సాగింది. చివరికి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఆ కారణంగానే ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు.

పఠాన్ కోట్ దాడుల గురించి ఇకపై జరిగే ప్రతీ సమావేశంలో భారత్ తమని తప్పకుండా నిలదీస్తుందని పాకిస్తాన్ ఊహించబట్టే, బలూచిస్తాన్ కధని రెడీ చేసిపెట్టుకొంది. అలాగే పఠాన్ కోట్ గురించి భారత్ ప్రశ్నిస్తే, సంజౌత ఎక్స్ ప్రెస్ కేసు గురించి పాక్ ఎదురుప్రశ్నిస్తోంది. భారత్-పాక్ సంబంధాలు దెబ్బ తినడానికి కారణం ఉగ్రవాదమని భారత్ వాదిస్తే, కాదు కాశ్మీర్ సమస్య అని పాక్ వాదిస్తోంది. పఠాన్ కోట్ దాడులకు కుట్రలు పన్నినవారు తమ దేశంలోనే ఉన్నారని, వారిని పట్టుకొని శిక్షిస్తామని మొదట చెప్పిన పాక్, నాలుగు నెలలు గడిచినా ఆ పని చేయకుండా తిరిగి భారత్ నే నిందించడం విస్మయం కలిగిస్తుంది. ఐజాజ్ అహ్మద్ చౌదరి వాదనలు గమనించినట్లయితే పాక్ కపట వైఖరిలో ఎటువంటి మార్పు లేదని మరొకమారు స్పష్టం చేసినట్లుంది. ఇరుగు పొరుగు దేశాలతో శాంతి, స్నేహం కోరుకొంటున్నామని చెపుతూ పాక్ మళ్ళీ ఈవిధంగా వ్యవహరించడం, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులలో పాక్ దళాలు మళ్ళీ భారత్ దళాలపై కాల్పులు మొదలుపెట్టడం పాక్ ద్వంద వైఖరికి ప్రత్యక్ష నిదర్శనాలే. కనుక దాని పట్ల భారత్ కూడా ఒక నిశ్చిత, కటిన వైఖరిని అవలంభించడం చాలా అవసరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close