ఉస్మానియాపై మహమూద్ అలీ మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిని కూల్చాల్సిందేనని, అవసరమైతే చార్మినార్‌నుకూడా కూల్చాల్సిందేనంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, అదే విషయంపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఉస్మానియా ఆసుపత్రి పై కప్పుమాత్రమే కూలుస్తామని, పాతగోడలపైనే కొత్త ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ఆ పాత గోడలపైనే పది-పదిహేను అంతస్తుల భవనాన్ని నిర్మిస్తామని కూడా అన్నారు. పాత గోడలపై అన్ని అంతస్తుల భవనాన్ని ఎలా నిర్మిస్తారో ఆయనకే తెలియాలి. ఏది ఏమైనా సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరున్న మహమూద్ అలీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో తెలియటంలేదంటూ తెరాసలోని నేతలు తలలు పట్టుకుంటున్నారు. అసలే ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత నిర్ణయానికి వ్యతిరేకత క్రమక్రమంగా పెరిగిపోతున్న ఈ తరుణంలో మహమూద్ అలీ తన వ్యాఖ్యలతో విషయాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నారని వాపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘స‌లార్ 2’… రెడీ టూ షూట్‌!

ప్ర‌భాస్ మూడ్ మొత్తం సినిమాల‌పైనే ఉంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా, షూటింగులు చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ 'క‌ల్కి'తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌, ఆ త‌ర‌వాత 'రాజాసాబ్' కు కొన్ని డేట్లు...

దటీజ్ పవన్ – ముద్రగడకు గౌరవం !

కుటుంబాల్లో చిచ్చు పెట్టడం వైసీపీ రాజకీయవ్యూహంలో ఒకటి. రామోజీరావు కుటుంబం నుంచి దేవినేని ఉమ కుటుంబం వరకూ ఎక్కడ చాన్స్ వచ్చినా వదిలి పెట్టలేదు. కానీ జనసేన చీఫ్ పవన్...

జగన్‌పై సీఐడీ కేసు పెట్టక తప్పదా !?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు ఫిర్యాదు చేస్తే వెంటనే సీఐడీలోని ఫలానా అధికారి విచారించాలని సీఈవో కార్యాలయం నుంచి ...

ఈసీ ఫెయిల్యూర్ – పోస్టల్ బ్యాలెట్స్ ఇలానా ?

ఏపీ ఎన్నికల సంఘం పనితీరు అత్యంత ఘోరంగా ఉంది. కనీసం పోస్టల్ ఓటింగ్ ను సరైన పద్దతిలో నిర్వహించడం కూడా చేత కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ స్మూత్ నిర్వహించడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close