ఇది తెలుసా! మహేష్‌కు తెలుగు చదవటం రాదట!

హైదరాబాద్: అవును! ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. శ్రీమంతుడు చిత్రం శుక్రవారం విడుదల అవుతున్న సందర్భంగా ఇవాళ ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన చిన్నతనమంతా చెన్నైలో గడిచిందని, అందుకే స్కూల్‌లో తెలుగు చదువుకోలేదని చెప్పారు. షూటింగ్ సమయంలో స్క్రిప్ట్‌లోని తన డైలాగులను – దర్శకుడు, సహాయ దర్శకులు చెప్పగా వింటానని, మెమరీద్వారా వాటిని గుర్తుపెట్టుకుని చెబుతానని వెల్లడించారు. మొదటి సినిమానుంచీ ఇదే పద్ధతిలో వెళుతున్నట్లు తెలిపారు. ఇది ఒకరకంగా ప్రయోజనకరంగా ఉందని చెప్పారు. తన మైండ్‌లో మాడ్యులేషన్ ఏదీ లేదుకాబట్టి ఆ డైలాగ్ సహజంగా, గుండెల్లోనుంచి వస్తుందని అన్నారు. మంచి జ్ఞాపకశక్తి తనకు వరమని, అది తన తండ్రి కృష్ణనుంచి వచ్చిందని చెప్పారు. తన తండ్రికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉందని, పేజీలకొద్దీ డైలాగులనుకూడా సింగిల్ టేక్‌లో చెప్పేస్తారని తెలిపారు.

సీన్ బాగా రావటంకోసం తాను టేక్‌లు ఎక్కువ తీసుకుంటానని మహేష్ చెప్పారు. జగపతిబాబు తన సీన్లను సింగిల్ టేక్‌లోనే చేయాలని అనుకుంటారని, అయితే తనకోసం ఈ సినిమాలో ఎడ్జస్ట్ అయ్యారని తెలిపారు. తనను వదిలిపెడితే రీటేక్‌లు అలా తీస్తూనే ఉంటానని నవ్వుతూ చెప్పారు. నటులు డాన్సులు చేయకూడదన్న వాదనతో గతంలో తానూ ఏకీభవించేవాడినని, అయితే ఇటీవల డాన్స్‌లపై కొద్దిగా శ్రద్ధ పెడుతున్నానని తెలిపారు.

ఏది ఏమైనా తెలుగు కథానాయకుడై ఉండి, మహేష్‌కు తెలుగు చదవటం రాదంటే తెలుగు భాషాభిమానులు మండిపడే అవకాశముంది. కనీసం ఆ విషయం బయటకు చెప్పకయ్యా బాబూ!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close