పంద్రాగస్ట్ లక్ష్యంగా పాక్ వ్యూహాలు?

స్వాతంత్ర్య దినోత్సవాలకు మనం ఒక రకంగా సిద్ధమవుతున్నాం. పాకిస్తాన్ మరో విధంగా రెడీ అవుతోంది. ఉగ్రవాద గుంపులను సరిహద్దులు దాటించి, మరణమృదంగం మోగించడానికి ప్లాన్ చేసిందని నిఘా వర్గాలు తాజాగా హెచ్చరించాయి. జమ్ము కాశ్మీర్లోని ఉధంపూర్లో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రువాదుల్లో ఒకరిని జవాన్లు కాల్చిచంపారు. మిగతా ఇద్దరినీ సజీవంగా పట్టుకున్నారు. వీరిద్ధరూ పాకిస్తానీ జాతీయులేనని అధికారులు తెలిపారు. గత వారం పంజాబ్ లోని గుర్దాస్ పూర్లో పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాదళాల కాల్పుల్లో హతమయ్యారు.

బుధవారం ఉధంపూర్లో దాడి చేసిన వారు కూడా ఆనాటి ముగ్గురు ఉగ్రవాదులతో కలిసే సరిహద్దులు దాటారని బయటపడింది. తాను పన్నెండు రోజుల క్రితం ఇండియాలో ప్రవేశించానని, పట్టుబడిన ఖాసిం ఖాన్ అనే ఉగ్రవాది చెప్పాడు. అంతేకాదు, భద్రతాదళాల విచారణలో ఉగ్రవాదుల నుంచి అనేక విషయాలు రాబట్టినట్టు సమాచారం. ఇటు జమ్ము కాశ్మీర్లో అమర్ నాథ్ యాత్రను టార్గెట్ చేయడంతో పాటు, ఢిల్లీలో పంద్రాగస్టు సందర్భంగా నరమేధం సృష్టించడానికి ఉగ్రవాదులు స్కెచ్ వేశారని నిఘా వర్గాల కథనం.

ఇప్పటికే కొందరు టెర్రరిస్టులు ఢిల్లీలో చొరబడి ఉంటారని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. అందుకే, కేంద్ర హోం శాఖను, ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐలు మన స్వాతంత్ర్య దినోత్సవానికి తమదైన శైలిలో సన్నాహాలు చేస్తుంటాయి. అయితే, పన్నెండు రోజుల క్రితం రావీ నదిని దాటి గుర్దాస్ పూర్ సమీపంలో భారత్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఎంత మంది అనేది కచ్చితంగా తెలియలేదని సమాచారం. అది తెలిస్తే, ఇంకా ఎంత మందితో ముప్పు ఉందనేదానిపై కచ్చితమైన అంచనా సాధ్యమవుతుంది.

అయితే పట్టుబడిన ఉగ్రవాదులకు కూడా తెలియకుండా, మరో బృందం మరో చోట సరిహద్దులు దాటి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిఘావర్గాలు ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా అలర్ట్ సైరన్ మోగించాయి. భద్రత బలహీనంగా ఉన్న చోట ఉగ్రవాదులు జన సమ్మర్థం గల ప్రాంతాల్లో విరుచుకు పడే అవకాశం ఉందని రా, ఐబీ లు హెచ్చరిక జారీ చేశాయి. తాజాగా పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులేనని, అందులో ఒకడి స్వస్థలం ఫైసలాబాద్ అని రూఢి అయింది. అయినా, వాళ్లు మావాళ్లు కాదని పాక్ దబాయించినా ఆశ్చర్యం లేదు. కసబ్ విషయంలో అదే జరిగింది. కాబట్టి, పాకిస్తాన్ ను నమ్మించడానికి సమయన్ని వృథా చేసే బదులు, అంతర్జాతీయ సమాజానికి ఈ వాస్తవం అర్థమయ్యేలా చేయడం ముఖ్యం. అలాగే, ఉగ్రదాడి జరిగితే పరిణామం తీవ్రంగా ఉంటుందని పాక్ కు తెలిసేలా ప్రతిస్పందన ఉంటేనే ఇంకోసారి మన జోలికి రాదని దేశ ప్రజలు భావిస్తున్నారు. ఈసారి పాక్ పంద్రాగస్ట్ టార్గెట్ కు మోడీ ప్రభుత్వం ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close