తెలంగాణాలో తెదేపాకి మరో షాక్!

ఆంధ్రప్రదేశ్ లో తెదేపా వైకాపాకి షాకులిస్తుంటే, తెలంగాణాలో తెరాస తెదేపాకి షాకులు ఇస్తోంది. ముగ్గురు తప్ప తెదేపా ఎమ్మెల్యేలందరినీ తీసుకొనిపోయిన తెరాస, ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎంపి మల్లారెడ్డిని కూడా తీసుకుపోబోతోంది. ఆయన జూన్ 2న తన అనుచరులతో కలిసి తెరాసలో చేరబోతున్నారని తాజా సమాచారం. అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఆయన పూర్తి చేసుకొన్నారు.

ఆయన 2014 ఎన్నికలకు ముందు తెదేపాలో చేరి మల్కజ్ గిరి నుంచి పోటీ చేసి లోక్ సభకి ఎన్నికయ్యారు. తెదేపా సీనియర్ నేత రేవంత్ రెడ్డిని కాదని ఆ సీటు మల్లారెడ్డికి కేటాయిస్తే, ఆయన ఇప్పుడు పార్టీకి హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డికే దానిని కేటాయించి ఉండి ఉంటే, తెదేపా దానిని నేడు కోల్పోయేదే కాదు.

లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కూడా ఆ సీటు కోసం చంద్రబాబు నాయుడుని అభ్యర్ధించారు. ఒకవేళ కేటాయించి ఉండి ఉంటే, ఒక మంచి అభ్యర్ధిని లోక్ సభకు పంపినట్లుండేది. కానీ అందరినీ కాదని మల్లారెడ్డికి అప్పగిస్తే ఆయన ఇప్పుడు పార్టీ ఫిరాయిస్తున్నారు. దీనితో తెలంగాణాలో తెదేపాకి ముగ్గురు ఎమ్మెల్యేలు (వారిలో ఆర్. కృష్ణయ్య గత రెండేళ్లుగా తెదేపాకి దూరంగా ఉంటున్నారు), కొందరు నేతలు మాత్రమే మిగిలారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణా శాసనసభలో కనీసం 99 సీట్లు సాధించే విధంగా ప్రణాళికలు రచించుకొని పనిచేస్తానని రేవంత్ రెడ్డి మహానాడులో చెప్పి సరిగ్గా 24గంటలు కూడా కాక మునుపే, మల్లారెడ్డి పార్టీ గోడ దూకేయడానికి సిద్దం అవడం విశేషం. మరి రేవంత్ రెడ్డి ఆ లక్ష్యం ఏవిధంగా సాధిస్తారో? చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close