ఉస్మానియా ఆసుపత్రిపై మాట మార్చిన ప్రభుత్వం

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం మాట మార్చింది. అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌ను కూలగొట్టే ఆలోచనేదీ తమకు లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సాంస్కృతిక వారసత్వ సంపదలోని భాగమైన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చబోతున్నారంటూ వస్తున్న వార్తలలో, ఆరోపణలలో నిజమెంతో వెల్లడించాలంటూ హైదరాబాద్‌కు చెందిన స్వామిదాస్ అనే న్యాయవాది హైకోర్ట్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్రప్రభుత్వం ఈ విధంగా స్పందించింది. ఆ భవనం హెరిటేజ్ భవనం కిందికి వస్తున్నందును దానిపై తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజలకు ముందుగా తెలపాలని హైకోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పడగొట్టటంమాట అటుంచి, ఆ భవనాన్ని పునరుద్ధరించాలన్నా హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీలనుంచి, అధికారులనుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని హైకోర్ట్ ధర్మాసనం ప్రభుత్వం తరపున వాదించిన తెలంగాణ ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుకు సూచించింది. భవనాన్ని కూల్చే ప్రతిపాదనేది లేదని రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ హామీని నమోదు చేసుకుని పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ భవనాన్ని కూలగొట్టి అక్కడ పది అంతస్తులతో బ్రహ్మాండమైన భవనాన్ని నిర్మిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను వేరే చోటకు తరలించటంకూడా ప్రారంభించారు. కేసీఆర్ నిర్ణయంపై ఒక్కసారిగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. అయితే తాజా పరిణామంతో ఉస్మానియా ఆసుపత్రిని కూల్చటానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వివిధ పార్టీలవారు, సాంస్కృతిక పరిరక్షణవాదులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close