తెరాసతో పొత్తులు భాజపాకి అవసరం లేదుట!

“తెలంగాణాలో తెరాసకి భాజపాయే ప్రత్యామ్నాయం. తెరాసని ఎదుర్కోగల శక్తి భాజపాకే ఉంది. వచ్చే ఎన్నికలలో తెరాసతో సహా మరే పార్టీతో పొత్తులు పెట్టుకోకుండానే భాజపా పోటీ చేసి అధికారంలోకి వస్తుంది. తెరాస ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ ముగిసింది. దాని పట్ల ప్రజలలో వ్యతిరేకత మొదలైంది. తెరాసపై యుద్ధం ఆరంభించి భాజపా సత్తా ఏమిటో దానికి రుచి చూపించబోతున్నాము,” అని అన్నారు భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు.

అమిత్ షా క్రిందటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తెరాస ఇష్టపడితే ఎన్డీయే కూటమిలో చేర్చుకొని కేంద్రమంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే స్పందిస్తూ “మీతో స్నేహం మాకు అక్కరలేదు..మీరిచ్చే కేంద్రమంత్రి పదవీ మాకు అక్కరలేదు.మమ్మల్ని ఇలాగ ప్రశాంతంగా బ్రతకనివ్వండి,”అని ఘాటుగా జవాబు చెప్పారు.

భాజపాకి ఇటువంటి చేదు అనుభవాలు మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్, తమిళనాడు, బిహార్, రాష్ట్రాలలో కూడా ఎదురయ్యాయి. ఇప్పుడు చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంది కనుక వాటితో పొత్తులు లేనిదే కాంగ్రెస్, భాజపాలు ఒంటరిగా పోటీచేసి గెలవలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికలే అందుకు చక్కటి ఉదాహరణ. ఆ సంగతి గ్రహించింది కనుకనే భాజపా తెలంగాణాలో తెరాసతో పొత్తులు పెట్టుకావాలని ప్రయత్నించి భంగపడింది.

‘అందని ద్రాక్ష పళ్ళు పుల్లన’ అన్నట్లు భాజపాతో పొత్తులు పెట్టుకోని కారణంగా తెరాస చెడ్డదయిపోయింది. పొత్తులకి తెరాసయే అంగీకరించలేదని చెప్పుకోవడం భాజపాకి నామోషీగా ఉంటుంది కనుక, తెరాసతో పొత్తులు పెట్టుకోబోమని మురళీధర్ రావు చెపుతున్నారు. తమిళనాడులో భాజపాతో పొత్తులకి అంగీకరించని జయలలిత (అన్నాడిఎంకె), కెప్టెన్ విజయ కాంత్ (డిఎండికె) పార్టీలపై ఎన్నికల సమయంలో ఏవిధంగా యుద్ధం చేసిందో, తెలంగాణాలో కూడా తెరాసపై అదే విధంగా యుద్ధం చేయడానికి భాజపా సిద్దం అవుతోంది. అక్కడ ఎన్నికల సమయంలో పొత్తులకి ప్రయత్నించి భంగపడింది. తెలంగాణాలో ఎన్నికలకి ఇంకా మూడేళ్ళ సమయం ఉండగానే తెరాసతో పొత్తులకి ప్రయత్నించి భంగపడింది. అంతే తేడా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close