ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ఆ మధ్య వైసీపీ నేతలు ప్రిపేర్ అయిపోయారు. జగన్ కూడా తాను విజయవాడలోనే ఉంటా..పోలీసులు ఎప్పుడైనా రావచ్చునని ఛాలెంజ్ చేశారు. అరెస్ట్ భయమో మరెమిటో మరుసటి రోజే జగన్ బెంగళూరుకు బయల్దేరి షాక్ ఇచ్చారు.ఆ తర్వాత రాష్ట్రమంతా మహానాడు హడావిడి నెలకొనడంతో జగన్ అరెస్ట్ ఇప్పట్లో ఉండదని అంతా ఫిక్స్ అయ్యారు.
మహానాడు పూర్తి అయింది. దాంతో జగన్ రెడ్డి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైనట్లేనని సజ్జల పరోక్షంగా చెప్పేశారు. కూటమి ప్రభుత్వం ఇష్టారీతిన కథ అల్లుకుంటూ కేసులు పెడుతున్నారని, అక్రమ కేసులు జగన్ వరకూ వెళ్తాయేమో అంటూ చెప్పుకొచ్చారు. అయినా , జగన్ పై ఇష్టారీతిన కేసులు పెట్టడానికి ఏం లేదు. ఆల్రెడీ ఆయనపై బోలెడన్నీ కేసులు ఉన్నాయి. విచారణ కూడా జరుగుతోంది. ఏ కేసులో ఎప్పుడు అరెస్ట్ అవుతారో చెప్పలేం. అలాంటిది ఆయనపై కొత్తగా కేసులు పెట్టనక్కరలేదనే వాదనలూ ఎప్పటి నుంచో ఉన్నాయి.
అయినా సజ్జల తాజా కామెంట్స్ వెనక ఏదో పెద్ద కథ ఉందని వైసీపీలో కొత్త చర్చ ప్రారంభమైంది. జగన్ పై కేసులు నమోదు చేస్తారని ఆయన మాట్లాడారంటే లిక్కర్ కేసులో జగన్ పాత్రను కూటమి సర్కార్ కు మరోసారి గుర్తుచేస్తున్నారా? అని పార్టీలోని సజ్జల వ్యతిరేకులు చర్చించుకుంటున్నారు.
జగన్ అరెస్ట్ అవుతే…పార్టీ అంతా సజ్జల హ్యాండోవర్ లోకి వెళ్తుంది. ఆయన అరెస్ట్ అయినా తొందరగా బయటకు రారని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు. అదే జరిగితే వైసీపీని సజ్జల చేతిలో పెట్టి జగన్ జైలుకు వెళ్తారని, అందుకే సజ్జల తొందరపడుతున్నారని టాక్ వినిపిస్తోంది.