హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప గాడిన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలలో రిజిస్ట్రేషన్ల సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. మే 2024తో పోలిస్తే ఈ ఏడాది మేలో దాదాపుగా పధ్నాలుగు శాతం పెరుగుదల కనిపిస్తోంది. మే 2025లో, రంగారెడ్డి జిల్లా 48 శాతం రిజిస్ట్రేషన్లు , మేడ్చల్-మల్కాజ్గిరి 37 శాతం, హైదరాబాద్ జిల్లా 15 శాతం రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లోఅత్యధిక భాగం రంగారెడ్డి జిల్లా పరిధిలోనే జరుగుతున్నాయి.
మే 2025లో కోటి అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు 37 శాతం పెరిగాయి. ఇవి మొత్తం రిజిస్ట్రేషన్లలో 19 శాతం. గత సంవత్సరం మేలో కోటి కన్నా ఎక్కువ ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు పధ్నాలుగు శాతమే ఉన్నాయి. 50 లక్షల కంటే తక్కువ , 50 లక్షల నుంచి 1 కోటి మధ్య ధర ఉన్న ప్రాపర్టీలు వరుసగా 55 శాతం, 26 శాతం రిజిస్టర్ అయ్యాయి. మే 2025లో, 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల పరిమాణంలోని ప్రాపర్టీలు 67 శాతం రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇవి ఎగువ మధ్యతరగతి ప్రజల నుంచి పెరుగుతున్న డిమాండ్ ను సూచిస్తున్నాయి.
మధ్యతరగతి ప్రజలు, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఇళ్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంత కాలం వడ్డీ రేట్లు, ఇతర అనిశ్చితుల కారణంగా ఆలోచిస్తూ వచ్చారు. ధరలు నిలకడగా ఉండటంతో ఇప్పుడు. అమ్మకాలు పుంజుకుంటున్నాయి.