పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగ్ రాజకీయాల్లో తెగ వాడేస్తున్నారు. ఏపీలో రప్పా..రప్పా నరికేస్తాం అని చెప్పి వైసీపీ కార్యకర్తలతో పోస్టర్లు వేయించి వాళ్లను జైలు పాలు చేశారు. తెలంగాణలోనూ రప్పా రప్పా పోస్టర్లు కనిపించాయి. అయితే .. తెలంగాణలో ఆ డైలాగును వాడేవారు కాస్త తెలివి ప్రదర్శించారు. రప్పా..రప్పాతోనే ఆపేశారు. దాంతో పెద్దగా వివాదం కాలేదు.
వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తోంది. పటాన్ చెరు నియోజకవర్గంలో అత్యధిక చోట్ల భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లు అయ్యాయి. అందుకే వాటికి రైతు భరోసా నిధులు ఇవ్వలేదు. ఆ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాల్సిందేనని హరీష్ రావు మహాధర్నా నిర్వహించారు. ఆ ధర్నాలోలోకి కొంత మంది కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకు వచ్చారు. ఈ ప్లకార్డులపై “2028లో రప్పా రప్పా 3.0 లోడింగ్” అని రాసి ఉంది.
ఈ ప్లకార్డుల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఆ పోస్టర్లపై హరీష్ రావు తప్ప మరొకరి ఫోటో లేదు. కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు అస్సల్లేవు. దాంతో ఈ డైలాగ్ హరీష్ రావుది మాత్రమేనని అర్థమవుతుంది. ఆ ప్లకార్డులు ఎవరైనా కార్యకర్త సొంతంగా తయారు చేసుకు వచ్చాడా లేకపోతే.. ఇంటెన్షనల్గా అందించారా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఏపీలో ఇలాంటి ప్లకార్డులు వైరల్ కావడంతో.. తెలంగాణలోనూ హాట్ టాపిక్ అయ్యాయి.